Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్.. ఒకే ఫ్రేమ్ లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు.. వైరల్ అవుతున్న పిక్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో హోరాహోరీగా పోటీపడ్డ మంచు విష్ణు,  ప్రకాష్ రాజ్ తాజాగా ఒకే వేదికపై కలిశారు. ఎన్నికలు ముగిసిన తర్వాత తొలిసారిగా ఒకే ఫ్రేమ్ లో కనిపించడం షాకింగ్ గా ఉంది. అందుకు సంబంధించిన పిక్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
 

Shocking Prakash Raj Manchu Vishnu in the same frame, Pick going viral
Author
Hyderabad, First Published Jun 23, 2022, 2:32 PM IST

టాలీవుడ్ లో గతేడాది నిర్వహించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (maa) ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ ఘన విజయం సాధించినన విషయం తెలిసిందే. ప్రస్తుతం విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా కొనసాతున్నారు. అయితే ఈ ఎన్నికలకు ముందుకు మంచు విష్ణు ప్యానెల్ మరియు ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు గట్టి పోటీ నడిచింది. నువ్వా నేనా అనే పంథా కొనసాగింది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కూడా వీరి ఇద్దరి మధ్య దూరాన్ని పెంచినట్టు గా అనిపించింది.

తాజాగా వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది. అయితే యంగ్ స్టార్ విశ్వక్ సేన్ 11వ చిత్రం ముహూర్తం మరియు పూజా కార్యక్రమాన్ని ఈ రోజు గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినిమాను ప్రారంభిస్తూ క్లాప్ కొట్టారు. చిత్ర యూనిట్ తో మాట్లాడి, ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఆయనతో పాటు ఈ చిత్ర  ప్రారంభోత్సవానికి టాలీవుడ్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) మరియు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) హాజరయ్యారు. 

చిత్ర పూజా కార్యక్రమంలో వీరిద్దరూ కూడా భాగస్వామ్యం అయ్యారు. చిత్ర యూనిట్ కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ఒకే వేదికపై కలవడంతో ఒకరినొకరు పలకరించుకున్నారు. ఒకరితో ఒకరు మర్యాదపూర్వకంగా మొదలటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన పిక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫొటోలో ప్రకాశ్ రాజ్,  మంచు విష్ణు మాట్లాడుతుండగా.. విశ్వక్ సేన్ వారి మాటలను వింటున్నట్టుగా కనిపిస్తోంది. మా ఎన్నికల తర్వాత వీరు కలవడం ఇదే తొలిసారి. 

 

Follow Us:
Download App:
  • android
  • ios