Asianet News TeluguAsianet News Telugu

శర్వానంద్‌ మరో ప్రయోగం `మహాసముద్రం`.. దర్శకుడు ఆయనే!

శర్వానంద్‌ హీరోగా, అజయ్‌ భూపతి రూపొందించబోతున్న `మహాసముద్రం` చిత్రాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఈ సినిమాకి సంబంధించిన ప్రతి వారం ఒక్కో సెన్సేషనల్‌ సర్‌ప్రైజ్‌ని అప్‌డేట్‌లుగా పంచుకుంటామని నిర్మాణసంస్థ తెలిపింది. 

sharwanand new film mahasamudram directed by ajay bhupathi has been officially announced
Author
Hyderabad, First Published Sep 7, 2020, 12:11 PM IST

`గమ్యం`, `ప్రస్థానం` వంటి చిత్రాల  తర్వాత మరోసారి ప్రయోగాత్మక, ఇంటెస్ట్ కథతో  సినిమా చేయబోతున్నాడు యంగ్‌ హీరో శర్వానంద్‌. తాజాగా ఆ సినిమాని ప్రకటించారు. `మహాసముద్రం` పేరుతో రూపొందే ఈ సినిమాకి `ఆర్‌ఎక్స్ 100` ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వం వహించనున్నారు. 

శర్వానంద్‌ హీరోగా, అజయ్‌ భూపతి రూపొందించబోతున్న `మహాసముద్రం` చిత్రాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఈ సినిమాకి సంబంధించిన ప్రతి వారం ఒక్కో సెన్సేషనల్‌ సర్‌ప్రైజ్‌ని అప్‌డేట్‌లుగా పంచుకుంటామని నిర్మాణసంస్థ తెలిపింది. దీన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్‌ సుంకర నిర్మించనున్నారు. ఈ బ్యానర్‌ నుంచి చివరగా మహేష్‌ నటించిన `సరిలేరు నీకెవ్వరు` బ్లాక్‌ బస్టర్‌ వచ్చిన విషయం తెలిసిందే. 

ఇందులో శర్వానంద్‌ పాత్ర చాలా ఛాలెంజింగ్‌గా ఉంటుందని, సినిమా అన్ని రకాల అంశాలు మేళవించిన ప్యాకేజీ ఎంటర్‌టైనర్‌ అని చెప్పారు. అజయ్‌ భూపతి పవర్‌ఫుల్‌ స్క్రిప్ట్ తో ఈ సినిమాని తెరకెక్కించనున్నాడని, అందుకే శక్తివంతమైన టైటిల్‌ పెట్టినట్టు తెలిపారు. ఇంటెన్స్ లవ్‌, యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో బైలింగ్వల్‌గా రూపొందించనున్నట్టు చిత్ర బృందం చెప్పింది.

శర్వానంద్‌ ప్రస్తుతం `శ్రీకారం` చిత్రంలో నటిస్తున్నారు. రైతు ప్రాధాన్యతని తెలిపే ఈ సినిమాకి కిశోర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంక అరుల్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. దీంతోపాటు మరో బైలింగ్వల్‌ చిత్రాన్ని శర్వానంద్‌ చేయబోతున్నట్టు టాక్‌.

Follow Us:
Download App:
  • android
  • ios