Asianet News TeluguAsianet News Telugu

'సరిలేరు నీకెవ్వరు' కు దెబ్బ, మహేష్ ఫీలయ్యాడా?

 ‘సరిలేరు.. మీకెవ్వరు’చిత్రంతోనే లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి దాదాపు పన్నెండేళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అనిల్ సుంకర, దిల్‌ రాజు, మహేశ్‌లు ఈ చిత్రాన్ని నిర్మించారు. రష్మిక మందన హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్ని అందించాడు.

Sarileru Neekevvaru Misses 100 Days Direct Centres
Author
Hyderabad, First Published Apr 20, 2020, 11:04 AM IST


మొన్న సంక్రాంతికి మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం కూడా విడుదలై భారీ సక్సెస్‌ను సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సరిలేరు నీకెవ్వరు చిత్రం అల.. వైకుంఠపురములో మూవీతో పోటీ పడినప్పటికీ...తన స్టామినాని నిరూపించుకుంది. మహేష్ ఖాతాలో ఓ సూపర్ హిట్ ని చేర్చింది. ఎంతలా అంటే  50 రోజుల్లో 139 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. దాంతో వంద రోజులు కు ఎంత కలెక్ట్ చేస్తుంది...ఎన్ని సెంటర్లలో ఈ సినిమా ఆడుతుంది...వంద రోజులు పంక్షన్ ఎక్కడ చేస్తారు అని అభిమానులు చర్చించుకున్నారు. వందవ రోజు కోసం ఆశగా ఎదురుచూసారు. అయితే ఈ లోగా ఎదురుచూడని విపత్తు వచ్చేసింది. 

కరోనా కరుణ లేకుండా అందరికీ కన్నీళ్లు మిగిలిస్తూ కట్టడిచేసేసింది. దాంతో ఈ సినిమా వంద రోజులు పంక్షన్ అనేది లేకుండా పోయింది. ఈ ఆదివారంతో వంద రోజుల రన్ ఈ సినిమా పూర్తి చేసుకునేంది. లాక్ డౌన్ లేకపోతే , థియోటర్స్ ఓపెన్ గా ఉంటే ఖచ్చితంగా వంద రోజులు సెంటర్లు కొన్నైనా ఉండేవి. ఖచ్చితంగా నిర్మాతలు ఈ పంక్షన్ ని చేసేవారు. ఆ ఆనందం లేకుండా పోయింది. లాక్ డౌన్ ఈ సినిమా నిర్మాతలకు పెద్ద జోల్ట్ ఇచ్చింది. ఏదైమైనా ఇప్పటి వరకు మహేష్ నటించిన సినిమాల గత రికార్డులను పూర్తిగా తుడిచిపెట్టేసింది ఈ చిత్రం.  ఈ చిత్రం మాస్ ఆడియన్స్‌ను బాగానే ఆకట్టుకుంది.  

 ‘సరిలేరు’  చిత్రం తాజాగా మరో ఘనతను అందుకుంది.  ఉగాది కానుకగా ఓ ప్రముఖ ఛానల్‌లో వచ్చిన ఈ చిత్రం అత్యధిక టెలివిజన్ వ్యూవర్‌షిప్ రేటింగ్ (టీవీఆర్)ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ‘బాహుబలి 2’రికార్డులను సైతం ఈ చిత్రం అధిగమించింది. ఇప్పటివరకు 22.70 టీవీఆర్‌తో బాహుబలి-2 అగ్ర స్థానంలో ఉండగా.. తాజాగా మహేశ్‌ సరిలేరు నీకెవ్వరు చిత్రం 23.4 టీవీఆర్‌ను సాధించి గత రికార్డులన్నింటిని తిరగరాసింది. బాహుబలి తొలి పార్ట్‌కు 21.84 టీవీఆర్‌ వచ్చిన విషయం తెలిసిందే. 

మహేశ్‌బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించారు. ‘దిల్‌’ రాజు సమర్పణలో రామబ్రహ్మం సుంకర, మహేశ్‌బాబు నిర్మించిన ఈ సినిమా జనవరి నెల 11న విడుదలైంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios