సాయి ధరమ్ తేజ్ హెల్త్ అప్డేట్.. మరో గుడ్ న్యూస్, వివి వినాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కు అపోలో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. శుక్రవారం బైక్ నుంచి పడి ప్రమాదానికి గురయ్యాడు తేజు. గాయాలు కావడంతో అతడి ఆరోగ్య పరిస్థితిపై అంతా ఆందోళన చెందారు.
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కు అపోలో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. శుక్రవారం బైక్ నుంచి పడి ప్రమాదానికి గురయ్యాడు తేజు. గాయాలు కావడంతో అతడి ఆరోగ్య పరిస్థితిపై అంతా ఆందోళన చెందారు. కానీ తేజుకు భయపడాల్సినంతగా గాయాలు కాలేదని.. త్వరలోనే కోలుకుంటాడని వైద్యులు తెలపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
గత మూడు రోజులుగా అపోలో ఆసుపత్రిలో తేజుకి చికిత్స కొనసాగుతోంది. వైద్యులు ఎప్పటికప్పుడు హెల్త్ అప్డేట్ ఇస్తున్నారు. తాజాగా సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
హెల్త్ బులిటెన్ ప్రకారం క్రమంగా తేజు ఆరోగ్యం మెరువవుతున్నట్లు తెలుస్తోంది. నెమ్మదిగా శ్వాస సంబంధించిన సమస్యలు తొలగిపోతుండడం శుభవార్త. ముందు జాగ్రత్తగా వైద్యులు తేజుని వెంటిలేటర్ సపోర్ట్ పై ఉంచారు. ఇప్పుడు శ్వాస ప్రక్రియ మెరుగవుతుండడంతో త్వరలోనే వెంటిలేటర్ నుంచి తొలగించబోతున్నట్లు తెలిపారు. ఆ ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు.
అయితే మరి కొన్ని గంటల పాటు తేజుని ఐసియులోనే ఉంచి మానిటర్ చేస్తామని వైద్యులు తెలిపారు. ఏది ఏమైనా తేజు ఆరోగ్యం క్రమంగా మెరుగవుతూ ఉండడం అభిమానులకు, కుటుంబ సభ్యులకు శుభవార్త అనే చెప్పాలి. ప్రస్తుతం తేజు ఆరోగ్యం నిలకడగా ఉంది.
ఇక తేజుని చూసేందుకు అపోలోకి సెలెబ్రిటీల రాక కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితమే క్రేజీ డైరెక్టర్ వివి వినాయక్ ఆసుపత్రికి వెళ్లారు. తేజుని చూశాక అతడి ఆరోగ్య పరిస్థితి బావుందని అన్నారు. తేజు ప్రమాదానికి గురి కావడంపై వినాయక్ మరో కీలక కామెంట్ కూడా చేశారు.
తేజు ఇటీవల డైటింగ్ ఎక్కువగా చేస్తున్నాడని తెలిసింది. డైటింగ్ లో ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అని వినాయక్ అన్నారు. ఇక వివి వినాయక్ తో పాటు భీమ్లా నాయక్ ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది.