Asianet News TeluguAsianet News Telugu

సుశాంత్‌ సోదరిపై రియా కేసు.. శ్వేతా సింగ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

అమెరికాలో ఉండే సుశాంత్‌ సోదరి స్వేతా సింగ్‌ కీర్తిని కూడా  ఇందులో ఇరికించింది రియా. దీంతో దీనిపై స్వేతా సింగ్‌ కీర్తి స్పందిస్తూ, మమ్మల్ని విడదీయలేదు. ఇది ఫేక్‌ ఎఫ్‌ఐఆర్‌ కాదని తెలిపింది. 

rhea case against sushant sister and swetha singh strong counter
Author
Hyderabad, First Published Sep 8, 2020, 3:21 PM IST

సుశాంత్‌ సింగ్‌రాజ్‌పుత్‌ సోదరిపై ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి ఫోర్జరీ కేసు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై సుశాంత్‌ సోందరి ప్రియాంక స్పందించారు. ఇది ఫేక్‌ ఎఫ్‌ఐఆర్‌ అని తెలిపింది. 

సుశాంత్‌ సోదరి ప్రియాంక సింగ్‌, మీతు సింగ్‌, అలాగే డాక్టర్‌ తరుణ్‌ కుమార్‌లపై ఫోర్జరీ కేసు పెట్టింది. మానసిక ఒత్తిడికి సంబంధించిన మందులతో ఓ బోగస్‌ మందుల చీటీని సుశాంత్‌ సోదరి ప్రియాంక సింగ్‌ ఫోర్జరీ చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మందులు వాడిన ఐదు రోజులకే సుశాంత్‌ మరణించాడని ఫిర్యాదులో తెలిపింది. 

దీంతో ప్రియాంక స్పందిస్తూ, రియాకి ఘాటుగా  రీప్లై ఇచ్చింది. అమెరికాలో ఉండే సుశాంత్‌ సోదరి స్వేతా సింగ్‌ కీర్తిని కూడా  ఇందులో ఇరికించింది రియా. దీంతో దీనిపై స్వేతా సింగ్‌ కీర్తి స్పందిస్తూ, మమ్మల్ని విడదీయలేదు. ఇది ఫేక్‌ ఎఫ్‌ఐఆర్‌ కాదని తెలిపింది. సుశాంత్‌ కేసులో న్యాయం జరిగేంత వరకు పోరాడతామని తెలిపింది. 

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసు ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి మెడకు గట్టిగా చుట్టుకుంటోంది. సుశాంత్‌ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ కోణం బయటపడటంతో ఆ కోణంలో నార్కొటిక్స్ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) విచారణ జరుపుతోంది. సోమవారం విచారించడంతోపాటు ఈ రోజు కూడా విచారణ జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఎన్‌సీబీ అధికారులు రియా సోదరుడు షోవిక్‌, సుశాంత్‌ మేనేజర్‌ శామ్యూల్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే నార్కొటిక్‌ అధికారులకు రియా తాను ఏం చేసినా సుశాంత్‌ ప్రేమ కోసమే అని తెలిపిన విషయం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios