బాలయ్య ఇంట్లో కాల్పుల ఎపిసోడ్తో వర్మ సినిమా?
పవర్ స్టార్ టైటిల్ తో పవన్ కళ్యాణ్ జీవితంలో జరిగిన ఎన్నికల ఘట్టం అనంతరం విశేషాలను తెరకెక్కిస్తూ సంచలనం క్రియేట్ చేస్తున్నారు. ఆ సినిమాకు ఓ రేంజిలో క్రేజ్ వచ్చింది. ఎంతలా అంటే..ట్రైలర్ కోసం జనాలు ఎదురు చూసేటంత.ట్రైలర్ తోనూ బిజినెస్ చేద్దామని వర్మకు ఆలోచన వచ్చేటంత. దాంతో ఆయన కు ఇప్పుడు మరో ఆలోచన కలిగిందట. ఇప్పుడు ఆయన టార్గెట్ బాలయ్య అని చెప్తున్నారు.
చూస్తూంటే రామ్ గోపాల్ వర్మ ఎవరి వ్యక్తిగత జీవితం వదిలేటట్లు లేరు. అన్నింటినీ తెరపై కు ఎక్కించి సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారు. తాజాగా ఆయన పవర్ స్టార్ టైటిల్ తో పవన్ కళ్యాణ్ జీవితంలో జరిగిన ఎన్నికల ఘట్టం అనంతరం విశేషాలను తెరకెక్కిస్తూ సంచలనం క్రియేట్ చేస్తున్నారు. ఆ సినిమాకు ఓ రేంజిలో క్రేజ్ వచ్చింది. ఎంతలా అంటే..ట్రైలర్ కోసం జనాలు ఎదురు చూసేటంత.ట్రైలర్ తోనూ బిజినెస్ చేద్దామని వర్మకు ఆలోచన వచ్చేటంత. దాంతో ఆయన కు ఇప్పుడు మరో ఆలోచన కలిగిందట. ఇప్పుడు ఆయన టార్గెట్ బాలయ్య అని చెప్తున్నారు.
ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న సమాచారం మేరకు.... నందమూరి బాలకృష్ణ ఇంట్లో కాల్పున ఘటన బేస్ చేసుకుని ఈ సినిమా ఉండబోతోందిట. అప్పట్లో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఆసుపత్రిలో చేరడం, ఆ తరవాతి పరిణామాలూ తెలుగు సినీ పరిశ్రమని షాక్కి గురి చేశాయి. ఇప్పటికీ ఆ విషయాల గురించి సినీ జనం ఎవరికి తోచిన వెర్షన్ లో వాళ్లు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇప్పుడు అదే విషయాన్ని మరోసారి `తెర`పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు రాంగోపాల్ వర్మ అంటున్నారు.
ఏటీటీ కోసం పవన్ కల్యాణ్ కథని `పవర్ స్టార్` పేరుతో తీస్తున్నట్టే.. ఇప్పుడు బాలయ్య కథనీ చెప్పబోతున్నాడట. బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల వ్యవహారంపై తీయబోయే ఈ సినిమాకి `ఆ రాత్రి ఏం జరిగిందంటే` అనే టైటిల్ పెట్టినట్టు తెలుస్తోంది. బాలకృష్ణ ఇంట్లో ఓ రోజు రాత్రి జరిగే కథ ఇది. ఇందులో వర్మ నిజాలే చూపించడానికి ప్రయత్నిస్తున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
అప్పటి జరిగిన ఆ విషయాలని మరోసారి పరిశీలించి.. స్క్రిప్టుని తయారు చేయిస్తున్నాడట వర్మ. పవన్ కల్యాణ్ సినిమా తీసినట్టే, ఈ సినిమా కూడా బాలయ్య డూప్ తో లాగించడానికి ట్రై చేస్తున్నాడట.అయితే ఇది కొందరు కావాలని మీడియాలో చేస్తున్న ప్రచారం అంటున్నారు. కానీ ఇదే వార్త నిజమైతే మాత్రం ఈసారి బాలయ్య ఫ్యాన్స్ మొత్తం వర్మ మీద విరుచుకుపడటం ఖాయం.