న్యూడ్ గా నటించడానికి రెడీ.. హీరోయిన్ కామెంట్స్!
తెలుగులో 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటి ఆశా సైని బాలీవుడ్ లో నటిగా సెటిల్ అవ్వాలనుకుంది. దాదాపు యాభై చిత్రాల్లో నటించిన ఈ భామ ఈ మధ్యకాలంలో పూర్తిగా సినిమాలకు దూరమైంది.
తెలుగులో 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటి ఆశా సైని బాలీవుడ్ లో నటిగా సెటిల్ అవ్వాలనుకుంది. దాదాపు యాభై చిత్రాల్లో నటించిన ఈ భామ ఈ మధ్యకాలంలో పూర్తిగా సినిమాలకు దూరమైంది.
రీసెంట్ గా టీవీ డాన్స్ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఓ వెబ్ సిరీస్ లో నటించింది. దీంట్లో ఈమె నగ్నంగా కనిపించనుందనే వార్తలు బాలీవుడ్ నాట ఎక్కువగా వినిపిస్తున్నాయి. బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ నిర్మించిన 'గంది బాత్' కి కొనసాగింపుగా వస్తోన్న 'గంది బాత్ 2'లో ఆశా శైని నటించింది.
ఈ వెబ్ సిరీస్ లో తన పాత్ర గురించి ఆమె మాట్లాడుతూ.. ''ఈ వెబ్ సిరీస్ లో నేను భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఒకే ఇంట్లో ఉండే ఇద్దరు సోదరులు నాతో ప్రేమలో పడతారు. నా పాత్రలో స్కిన్ షోకి ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. హాట్ సన్నివేశాలను దర్శకుడు సచిన్ మొహిత్ మరింత అందంగా చిత్రీకరించారని భావిస్తున్నారు.
ఇలాంటి శృంగారభరిత సన్నివేశాల్లో నటించడం చాలెంజింగ్ గా అనిపిస్తుంది. అందుకే ఒక నటిగా నేను ఈ పాత్ర ఎన్నుకున్నాను. అవసరమైతే న్యూడ్ గా నటించడానికి కూడా నేను రెడీ'' అంటూ వెల్లడించింది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ప్రసారం కానుంది. మరి ఇందులో ఆశా సైని ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో చూడాలి!