సమంత ఛాలెంజ్ స్వీకరించిన రష్మిక మందన్న
తన ఇంటి ఆవరణంలో మొక్కలు నాటిన యువ హీరోయిన్ రష్మిక మందన ఆ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ఛాలెంజ్ లోకి తనను ఆహ్వానించిన సమంతకు కృతజ్ఞతలు తెలిపింది రష్మిక
టాలీవుడ్ సెలబ్రిటీల గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో యాక్టివ్గా పాల్గొంటున్నారు. సీనియర్ల నుంచి యంగ్ జనరేషన్ స్టార్స్ వరకు సినిమాల నుంచి టీవీ నటుల వరకు ప్రతీ ఒకరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటుతూ అభిమానులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత అక్కినేని విసిరిన ఛాలెంజ్ను స్వీకరించిన రష్మిక మొక్కలు నాటింది.
తన ఇంటి ఆవరణంలో మొక్కలు నాటిన యువ హీరోయిన్ రష్మిక మందన ఆ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ఛాలెంజ్ లోకి తనను ఆహ్వానించిన సమంతకు కృతజ్ఞతలు తెలిపింది రష్మిక. ఈ సందర్భంగా తన అభిమానులను అదేవిధంగా యువతీ యువకులను పెద్ద ఎత్తున మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను మరింత గొప్పగా కొనసాగించాలని పిలుపునిచ్చింది.
ఈ సందర్భంగా తన సహచర హీరోయిన్లు రాశీఖన్నా, కళ్యాణి ప్రియదర్శన్, ఆశికా రంగనాథ్ లను ఈ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని చాలెంజ్ చేసింది రష్మిక. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహా ఉధృతంగా కొనసాగుతోంది ఈ చాలెంజ్ లో భాగంగా నటీనటులు, ప్రముఖులు పెద్ద ఎత్తున మొక్కలు నాటి తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాలలో తెలియజేస్తున్నారు.