Asianet News TeluguAsianet News Telugu

సురేష్ బాబు చేసిన లేటు..ఈ సినిమాపై కరోనా కాటు

 సినిమా పూర్తి కాగానే  రానా పిలిచి మెచ్చుకుని, సురేష్ బాబు నిర్మాణంలో ఒక చిన్న సినిమా ఆఫర్ ఇచ్చారు. ఆ సినిమా పూర్తి చేసి  రిలీజ్ చేయక అలా మిగిలిపోయారు. క్షణం డైరక్టర్ ని అందరు మర్చిపోయారు. దాంతో ఓ రకంగా నిరాశే పరిస్దితే. కష్టపడి సంపాదించుకున్న క్రేజ్ మొత్తం పోయింది. పూర్తి చేసిన సినిమా సురేష్ బాబు ఒక సినిమాని ఒక పట్టాన రిలీజ్ కి ఒప్పుకోకుండా ..కరెక్షన్స్ అంటూ అలాగే ఉంచేసేరని వార్తలు వచ్చాయి. దాంతో డైరక్టర్ ఇంక చేసేదేముంది అని నమస్కారం పెట్టి వెళ్లిపోయాడు. 
 

Rana Daggubati Krishna and his Leela movie will be release in Netflix
Author
Hyderabad, First Published May 4, 2020, 11:28 AM IST


అప్పట్లో అడవి శేషుతో చేసిన థ్రిల్లర్  "క్షణం" సినిమాకి ఎంత పేరు వచ్చిందో అందరికీ తెలుసు. ఆ సినిమా తర్వాత అడివి శేష్ వరస సినిమాలు చేస్తూ రిలీజ్ చేస్తూనే ఉన్నారు..ఓ రకంగా ఆయన కెరీర్ స్థిర పడిపోయింది.  కానీ  డైరక్టర్ రవికాంత్ పేరు మాత్రం ఆ తర్వాత ఏమైపోయాడో ఎవరికీ అర్దం కాలేదు. ఆ సినిమా పూర్తి కాగానే  రానా పిలిచి మెచ్చుకుని, సురేష్ బాబు నిర్మాణంలో ఒక చిన్న సినిమా ఆఫర్ ఇచ్చారు. ఆ సినిమా పూర్తి చేసి  రిలీజ్ చేయక అలా మిగిలిపోయారు. క్షణం డైరక్టర్ ని అందరు మర్చిపోయారు. దాంతో ఓ రకంగా నిరాశే పరిస్దితే. కష్టపడి సంపాదించుకున్న క్రేజ్ మొత్తం పోయింది. పూర్తి చేసిన సినిమా సురేష్ బాబు ఒక సినిమాని ఒక పట్టాన రిలీజ్ కి ఒప్పుకోకుండా ..కరెక్షన్స్ అంటూ అలాగే ఉంచేసేరని వార్తలు వచ్చాయి. దాంతో డైరక్టర్ ఇంక చేసేదేముంది అని నమస్కారం పెట్టి వెళ్లిపోయాడు. 

అయితే ఆ తర్వాత సురేష్ బాబు తనయుడు  దగ్గుపాటి రానా సీన్ లోకి వచ్చాడు. ఈ డైరక్టర్ గురించి తెలుసుకుని, అతని భాధ అర్దం చేసుకుని సినిమా రిలీజ్ కు పెట్టాడు. ఈ  చిత్రాన్ని సమర్పిస్తూ పోస్టర్ రిలీజ్ చేసి కాస్త రిలీఫ్ ఇచ్చాడా డైరక్టర్ కు. అయితే సినిమా రిలీజ్ చేద్దామనుకునే టైమ్ కు కరోనా దెబ్బ పడింది. ఇప్పడిప్పుడే థియోటర్ రిలీజ్ లు లేవు. ఈ నేఫధ్యంలో చిత్ర నిర్మాణ సంస్ద... ఈ సినిమాని ఓటీటిలో రిలీజ్ చేయాలని నిర్ణయించుకుందని సమాచారం. అలా 'కృష్ణ అండ్ హిజ్ లీల' త్వరలో నెట్ ఫ్లిక్స్ లో రానుందట.  ప్రోమోలతో ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగచేస్తోంది.  

‘కృష్ణ అండ్ హిజ్ లీల’ అనే సినిమాను రానా సమర్పించబోతున్నాడు. ‘క్షణం’ దర్శకుడు రవికాంత్ పేరేపు దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్, సంజయ్ రెడ్డి, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. గుంటూరు టాకీస్ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, శీరత్ కపూర్, శాలిని వడ్నికత్తి హీరోయిన్‌లుగా కనిపించనున్నారు. 

ఈ చిత్రం నిజ జీవితంలో వచ్చిన రూమర్ల ఆధారంగా తెరకెక్కడం విశేషం. ఏదేమైనా 2016లో క్షణం మూవీని తెరకెక్కించిన రవికాంత్ పేరేపు దాదాపు నాలుగు  సంవత్సరాల తరువాత ఈ రెండో సినిమా రిలీజ్ కు రెడీ అవటం,అది కూడా ఓటీటీలో కావటం గమనార్హం. ఇది కాకుండా జేడీ చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన 'MMOF' కూడా ఓటీటీ రిలీజ్ కు సిద్ధం అవుతోందని సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios