వర్మ మార్క్ `మర్డర్`.. కుటుంబ కథా చిత్రమ్
లాక్ డౌన్ సమయంలో వరుసగా సినిమాలు రిలీజ్ చేస్తూ హల్ చల్ చేస్తున్న వర్మ తాజాగా ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాలో ఏటీటీలో కాకుండా, ఓటీటీ ప్లాట్ ఫాంలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నట్టుగా వర్మ ఇటీవల ప్రకటించాడు.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కంపెనీ నుంచి వస్తున్న తాజా చిత్రం మర్డర్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పరువు హత్య ప్రణయ్ హత్యోదంతం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించాడు వర్మ. ప్రణయ్ హత్య ఆ తరువాత ప్రణయ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అమృతకు ఎదురైన అనుభవాలను, ప్రణయ్ హత్యకు దారి తీసిన సంఘటనలు, ఈ నేపథ్యంలో అమృత తండ్రి మానసిక సంఘర్షణ ఇలా అనే కోణాలను తన సినిమాలో ఆవిష్కరించనున్నాడు వర్మ.
లాక్ డౌన్ సమయంలో వరుసగా సినిమాలు రిలీజ్ చేస్తూ హల్ చల్ చేస్తున్న వర్మ తాజాగా ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాలో ఏటీటీలో కాకుండా, ఓటీటీ ప్లాట్ ఫాంలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నట్టుగా వర్మ ఇటీవల ప్రకటించాడు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్తో మరోసారి తన మార్క్ చూపించాడు. ఆనంద్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వర్మ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. ఎలాంటి డైలాగ్స్ లేకపోయినా దాదాపు సినిమా కథ అంతా ట్రైలర్లోనే రివీల్ చేశాడు వర్మ. ట్రైలర్తో సమాజానికి చాలా ప్రశ్నలను సందించాడు వర్మ.
ఈ సినిమాను నట్టి ఎంటర్టైన్మెంట్స్, క్విటీ ఎంటర్టైన్మెంట్స్, అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టి కరుణ, నట్టి క్రాంతీలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాపై ప్రణయ్ కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ప్రణయ్ తండ్రి బాలస్వామి ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. వర్మ తెరకెక్కించే సినిమా కారణంగా ప్రణయ్ హత్య కేసు విచారణ ప్రభావితం అయ్యే అవకాశం ఉందని బాలస్వామి ఆరోపిస్తున్నారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం, చిత్రయూనిట్ మీద కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.