Asianet News TeluguAsianet News Telugu

రామ్ చ‌ర‌ణ్‌ అక్కడికి వెళ్లగానే...పులిహార వార్త వండేసారే.!!

 రామ్ చరణ్ వంటి స్టార్ సీన్ లో ఉంటే ఇంక చెప్పేదేముంది. వ్యూస్ కోసం న్యూస్ లు రెడీ అయ్యిపోతాయి. అలాంటిదే ఓ వార్త ఇప్పుడు వెబ్ మీడియా నుంచి  సోషల్ మీడియాకు వెళ్లి అక్కడ హల్ చల్ చేస్తోంది. ఆ వార్త మరేదో కాదు

Ram Charan, Manchu manoj movie news fake?
Author
Hyderabad, First Published Mar 12, 2020, 9:23 AM IST


ఫొటో చూసి పులిహార కలిపేయటం మనవాళ్లకు బాగా అలవాటైంది. తమ క్రియేటివిటీని జోడించి క్షణాల్లో వండి వడ్డించేస్తూంటారు. ముఖ్యంగా రామ్ చరణ్ వంటి స్టార్ సీన్ లో ఉంటే ఇంక చెప్పేదేముంది. వ్యూస్ కోసం న్యూస్ లు రెడీ అయ్యిపోతాయి. అలాంటిదే ఓ వార్త ఇప్పుడు వెబ్ మీడియా నుంచి  సోషల్ మీడియాకు వెళ్లి అక్కడ హల్ చల్ చేస్తోంది. ఆ వార్త మరేదో కాదు మంచు మనోజ్, రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ మల్టి స్టారర్ చిత్రం రూపొందనుందని. రామ్ చరణ్ మల్టిస్టారర్ చేయదలచుకుంటే ఎన్టీఆర్ తో చేస్తాడు లేదా మహేష్ తో చేస్తాడు కానీ పోయి పోయి ...మంచు మనోజ్ తో ఎందుకు చేస్తాడనేది కీలకమైన ప్రశ్న. అసలు ఈ వార్త లాంటి రూమర్ ఎలా పుట్టింది అంటే..

రీసెంట్‌గా మంచు మనోజ్ హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్న ‘అహం బ్రహ్మాస్మి’ సినిమా ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా రామ్ చరణ్ విచ్చేసి క్లాప్ కొట్టాడు. మంచు మ‌నోజ్ స్వ‌ీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అత్యంత భారీ స్థాయిలో రూపొందనున్న ఈ మూవీ ఇటీవ‌ల‌ హైద‌రాబాద్ లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.శ్రీకాంత్‌ ఎన్‌ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. 

మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ సిల్వర్‍ స్క్రీన్‍పై తన  ఎంట్రీ ఇస్తున్నాడు మంచు మనోజ్. దీంతో ఈ చిత్రంపై ఎక్సపెక్టేషన్స్ పెంచటానికి రంగం సిద్దం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మంచు మనోజ్ ఇద్దరూ కలిసి ఓ మల్టీ స్టారర్‌ చిత్రంలో నటించబోతున్నారట అంటూ ఓ వార్త మొదలైంది. అది కూడా ఓ ఓల్డ్  హిట్‌ సినిమా రీమేక్ అన్నారు. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కబోతుందని కొసమెరపు ఇచ్చారు. ఇంతకీ ఆ ఓల్డ్ హిట్ ఏమిటీ అంటే..

అప్పట్లో చిరంజీవి, మోహన్ బాబు హీరోలుగా నటించిన ‘బిల్లా రంగా’ సినిమాను రీమేక్ చేస్తారట. ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టు రీమేక్ చేయాలనున్నట్టు చెప్తున్నారు. బిల్లా రంగాలో.. చిరు, మోహన్‌ బాబులు ద్విపాత్రాభినయం చేశారు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది.  యాక్షన్‌ చిత్రాల్లో కొత్త ఒరవడి సృష్టించింది. ఇప్పుడు ఈ చిత్రంలో.. చరణ్, మనోజ్‌లు వాళ్ల తండ్రుల చేసిన పాత్రలో నటించబోతున్నట్టు ప్ర‌చారం చేస్తున్నారు. ఇది వింటూంటే క్లియర్ గా తెలిసిపోవటం లేదూ..ఇదో పులిహార వార్త అని.

Follow Us:
Download App:
  • android
  • ios