Asianet News TeluguAsianet News Telugu

టాలీవుడ్‌ డ్రగ్స్ కేసుః ముగిసిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ విచారణ.. నవదీప్‌, కెల్విన్‌లకు నగదు లావాదేవీలపై ఆరా

ప్రధానంగా రకుల్‌కి చెందిన మూడు బ్యాంక్‌ అకౌంట్లపై ఈడీ ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. ఆమె అకౌంట్ల నుంచి టాలీవుడ్‌ డ్రగ్స్ కేసులో ప్రధాన పాత్ర ధారి అయిన కెల్విన్‌కి, నవదీప్‌లకు నగదు బదిలీపై ఈడీ అధికారులు రకుల్‌ని ప్రశ్నించారు.

rakul preet singh ed interrogation completed intresting things revealed
Author
Hyderabad, First Published Sep 3, 2021, 4:55 PM IST

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈడీ విచారణ పూర్తయ్యింది. శుక్రవారం ఉదయం నుంచి రకుల్‌ని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. రకుల్ రిక్వెస్ట్ మేరకు ఈ రోజునే విచారించేందుకు ఈడీ అధికారులు ఒప్పుకున్నారు. పది గంటల నుంచి ఆమెని విచారణ కొనసాగుతుంది. అయితే దాదాపు ఏడుగంటల సుధీర్ఘంగా రకుల్‌ విచారణ జరిగింది. ఆమెపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. దాదాపు వంద వరకు ప్రశ్నలడిగినట్టు తెలుస్తుంది. 

ప్రధానంగా రకుల్‌కి చెందిన మూడు బ్యాంక్‌ అకౌంట్లపై ఈడీ ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. ఆమె అకౌంట్ల నుంచి టాలీవుడ్‌ డ్రగ్స్ కేసులో ప్రధాన పాత్ర ధారి అయిన కెల్విన్‌కి, నవదీప్‌లకు నగదు బదిలీపై ఈడీ అధికారులు రకుల్‌ని ప్రశ్నించారు. నవదీప్‌కి చెందిన ఎఫ్‌ క్లబ్‌ మేనేజర్‌కి, కెల్విన్‌కి, రకుల్‌కి మధ్య లావాదేవీలపై కూడా ఈడీ దృష్టి సారించారు. వారికి నగదు ట్రాన్స్ ఫర్‌ ఎందుకు చేశారని, వారితో సంబంధం ఏంటి? అనే ప్రశ్నలను ఈడీ సందించినట్టు తెలుస్తుంది. మరోవైపు హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో ఉన్న రకుల్‌ బ్యాంక్‌ అకౌంట్ల వివరాలను సైతం సేకరించి, వాటి ట్రాన్సాక్షన్స్ ని కూడా ఈడీ విచారిస్తున్నారు.

అదే సమయంలో రకుల్‌ హైదరాబాద్‌లో ఓ ఫిట్‌నెస్‌ సెంటర్‌ని నిర్వహిస్తుంది. ఆ సెంటర్‌కి చెందిన లావాదేవీలపై కూడా ఈడీ విచారించినట్టు తెలుస్తుంది. మరోవైపు ఎఫ్‌ క్లబ్‌లో జరిగిన పార్టీలో రకుల్‌ పాల్గొన్నట్టు సీసీ పూటేజీ ద్వారా నిర్ధారించుకున్న ఈడీ అధికారులు, ఆ పార్టీలో ఏం జరిగింది. అందులో పాల్గొన్న ఇతర నటీనటులపై కూడా ఫోకస్‌ పెట్టారట. బాలీవుడ్‌కి చెందిన రియా చక్రవర్తితో ఉన్న సంబంధంపై కూడా ఈడీ విచారించింది. కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఎప్పుడు విచారణకు పిలిస్తే అప్పుడు హాజరు కావాలని కోరినట్టు తెలుస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios