ఆ పాత్రలో రాశి ఖన్నా ...చెమటలు పట్టాల్సిందే
రాశీ ఇప్పుడు మళ్లీ బిజీ అవుతోంది. ఆమె చేతినిండా సినిమాలతో ఫుల్ స్వింగ్లోఉంది రాశీ. ప్రస్తుతం వెబ్ సిరీస్లతో పాటు వరుసగా సౌత్లో సినిమాలతో బిజీ అయ్యింది.
కెరీర్ ప్రారంభం నుంచీ రాశీ ఖన్నా వరస పెట్టి సినిమాలు చేస్తున్నా పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు. పర్ఫామెన్స్ తో పని లేకుండా గ్లామర్ తో లాక్కొచ్చేసిసంది.అయితే ఆమె స్పీడుకుక ‘వరల్డ్ ఫేమస్ లవర్’ బ్రేక్ వేసింది. ఆ సినిమాలో చేసిన గ్లామర్ షో మిస్ ఫైర్ అవ్వడంతో సడెన్గా ఫేడవుట్ అయిపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ బిజీ అవుతోంది. ఆమె చేతినిండా సినిమాలతో ఫుల్ స్వింగ్లోఉంది రాశీ. ప్రస్తుతం వెబ్ సిరీస్లతో పాటు వరుసగా సౌత్లో సినిమాలతో బిజీ అయ్యింది.
సౌత్లో, ముఖ్యంగా తెలుగులో నాగ చైతన్య, విక్రమ్ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘థాంక్యూ’ సినిమాతో పాటు గోపీచంద్- మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పక్కా కమర్షియల్’ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్గణ్ నటిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ సిరీస్ ‘రుద్ర’ సిరీస్లో రాశీ నటిస్తోంది.
అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చిత్రం ‘రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్’. రాజేష్ మపుస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, బీబీసీ స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశిఖన్నా కీలక పాత్రలో నటించనుంది. ఇప్పటికే ఎన్నో పోలీసు పాత్రల్ని పోషించిన అజయ్ ఈ వెబ్ సిరీస్లో పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. క్రైమ్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమా జులై 21 సెట్స్ పైకి వెళ్లనుంది.
సినిమా షూటింగ్ ముంబయిలోని వివిధ ప్రాంతాల్లో రెండునెలల పాటు చిత్రీకరణ జరుపుకోనుందని సమాచారం. ఇందులో రాశిఖన్నా తెలివిగల ఉన్మాద సైకో - హంతకురాలిగా కనిపించనుందట. రాశి నటిస్తున్న తొలి డిజిటల్ చిత్రం కూడా ఇదే కానుంది. సినిమా డిస్నీ+ హాట్స్టార్ వీఐపీ ఓటీటీ వేదికగా విడుదలకానుందని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. ఈ చిత్రం బ్రిటీష్ వెబ్ సిరీస్గా వచ్చిన ‘లూథర్’ ఆధారంగా తెరకెక్కుతోంది.