Asianet News TeluguAsianet News Telugu

టాలీవుడ్‌ డ్రగ్స్ కేసుః పూనమ్‌ కౌర్‌ షాకింగ్‌ ట్వీట్‌

డ్రగ్స్ కేసులో ఈడీ(ఎన్‌ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్‌) పలువురు టాలీవుడ్‌ తారలకు నోటీసులు పంపించింది. ఇప్పటికే పూరీ జగన్నాథ్‌, ఛార్మిల విచారణ పూర్తయ్యింది. శుక్రవారం(నేడు) రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో నటి పూనమ్‌ కౌర్‌ షాకింగ్‌ కామెంట్స్ చేసింది.

poonam kaur shocking tweet on tollywood drugs case
Author
Hyderabad, First Published Sep 3, 2021, 3:31 PM IST

ఫేడౌట్‌ హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌ అడపా దడపా స్పందిస్తూ బాంబులు పేలుస్తుంది. పవన్‌ కళ్యాణ్‌కి సపోర్ట్ గా నిలిచే ఈ భామ ఇప్పుడు టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారంపై స్పందించింది. ట్విట్టర్‌ ద్వారా ఆమె షాకింగ్‌ కామెంట్స్ చేసింది. డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్‌ని ఉక్కిరి బిక్కిరి చేసింది. నాలుగేళ్ల నాటి వ్యవహారాన్ని మళ్లీ తిరగదోడింది ప్రభుత్వం. డ్రగ్స్‌ కేసులో కీలక పాత్రధారి అయిన కెల్విన్‌ చెప్పిన ఆధారాల మేరకు  పూరీ జగన్నాథ్‌, ఛార్మి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, రానా, రవితేజ, రవితేజ డ్రైవర్‌, నవదీప్‌, ఎఫ్‌ క్లబ్‌ మెనేజర్, ముమైత్‌ ఖాన్‌, తనీష్‌, నందు, తరుణ్‌ లకు ఈడీ(ఎన్‌ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్‌)నోటీసులు పంపించింది. 

దీంతో వీరిని విచారిస్తుంది ఈడీ. ఇప్పటికే పూరీ జగన్నాథ్‌, ఛార్మిల విచారణ పూర్తయ్యింది. శుక్రవారం(నేడు) రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో నటి పూనమ్‌ కౌర్‌ షాకింగ్‌ కామెంట్స్ చేసింది. `డ్రగ్స్‌ అనేది కేవలం సెలబ్రిటీల సమస్య కాదు. ఇది ప్రతి ఒక్కరి సమస్య. సరిహద్దు సమస్య. పొలిటికల్‌ అజెండాతో జరుగుతున్న వ్యవహారం. బలమైన ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సమస్య. ఈ మొత్తం వ్యవహారంపై త్వరలోనే నా స్వీయ అనుభవాలను మీతో పంచుకుంటా` అని పూనమ్‌ కౌర్‌ ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం పూనమ్‌ చేసిన ట్వీట్‌ టాలీవుడ్‌ దుమారం రేపుతుంది.

పూనమ్‌ ఇప్పుడు ఏం చెప్పబోతుందనేది హాట్‌ టాపిక్‌గా మారింది. 2006లో `మాయాజాలం` చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా రంగ ప్రవేశం చేసింది పూనమ్‌ కౌర్‌. `ఒక వి చిత్రం`,`శౌర్యం`, `వినాయకుడు`, `ఈనాడు`, `గణేష్‌`, `నాగవళ్లీ`, `ప్రయాణం`, `గగనం`, `ఆడు మగాడ్రా బుజ్జి`, `ఎటాక్‌` వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటోంది.

Follow Us:
Download App:
  • android
  • ios