Asianet News TeluguAsianet News Telugu

డ్రగ్స్ కేసులో సినీనటుడు తనీష్‌కు నోటీసులు,నిర్మాతకు కూడా


డ్రగ్స్ కేసు విచారిస్తున్న బెంగళూరులోని బాణసవాడి ఉపవిభాగం పోలీసులు తెలుగు సినీ నటుడు తనీష్‌తోపాటు మరో ఐదుగురిని శనివారం విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. వీరిలో ఓ ఇండస్ట్రలియస్ట్, సినీ నిర్మాత తదితరులున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. డ్రగ్స్ కేసులో ఇద్దరు విదేశీయులను మొదట అరెస్టు చేసి విచారించారు. వారిచ్చిన సమాచారం మేరకు మస్తాన్‌, విక్కి మల్హోత్రా పేర్లు బయటకు వచ్చాయి. 

Police summon Telugu actor Tanish in drugs case jsp
Author
Hyderabad, First Published Mar 13, 2021, 7:15 AM IST

డ్రగ్స్ కేసు విచారిస్తున్న బెంగళూరులోని బాణసవాడి ఉపవిభాగం పోలీసులు తెలుగు సినీ నటుడు తనీష్‌తోపాటు మరో ఐదుగురిని శనివారం విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. వీరిలో ఓ ఇండస్ట్రలియస్ట్, సినీ నిర్మాత తదితరులున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. డ్రగ్స్ కేసులో ఇద్దరు విదేశీయులను మొదట అరెస్టు చేసి విచారించారు. వారిచ్చిన సమాచారం మేరకు మస్తాన్‌, విక్కి మల్హోత్రా పేర్లు బయటకు వచ్చాయి. 

మస్తాన్‌ను విచారించగా సినీ నిర్మాత శంకరగౌడ పేరు వెలుగులోకి వచ్చింది. ఆయన తన ఆఫిస్ లో మద్యం, విందు పార్టీలు ఇస్తున్నట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఈ పార్టీలకు ప్రముఖులు హాజరయ్యేవారు. తెలుగులో పలు సినిమాల్లో నటించిన తనీష్‌కు నోటీసు పంపినట్లు నగర పోలీసు వర్గాలు ధ్రువీకరించాయి. 2017 జులైలో జరిగిన మాదక ద్రవ్యాల కేసులో ఆయన హైదరాబాద్‌ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ముందు హాజరయ్యారు. 

గతంలోనూ డ్రగ్స్ వాడకం, కొనుగోలు, ఇతర అంశాల గురించి అధికారులు తనీష్‌ ని విచారించారు. అయితే అప్పుడు సినీ పరిశ్రమలో ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నా. డ్రగ్స్ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదు. మాదక ద్రవ్యాలు వాడను. పబ్బులు, క్లబ్బులకు వెళ్లే అలవాటు లేదు. పరిశ్రమలో డ్రగ్స్ వాడేవారు చాలా మందే ఉన్నారు. సినీ పరిశ్రమలో పెద్దవాళ్లకు డ్రగ్స్ సరఫరా చేసే వాళ్లు ఉన్నారు. చిన్నవాళ్లం.. మమ్మల్ని వదలేయండి అని అధికారులను వేడుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios