పవన్, సురేందర్ రెడ్డి మూవీ పోస్టర్.. 'యథా కాలం.. తథా వ్యవహారమ్' ఏంటిది ?
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలు పూర్తయ్యాక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. రామ్ తాళ్లూరి ఈ చిత్రానికి నిర్మాత. వక్కంతం వంశీ ఈ మూవీకి రచయితగా పనిచేస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు వరుస సర్ ప్రైజ్ లు ఎదురవుతున్నాయి. ఇప్పటికే బీమ్లా నాయక్ చిత్రం నుంచి టైటిల్ సాంగ్ విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సాంగ్ అభిమానులని ఉర్రూతలూగించే విధంగా ఉంది.
ఇక హరిహర వీరమల్లు చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 29న రిలీజ్ చేయబోతున్నట్లు అప్డేట్ ఇచ్చేశారు. తాజాగా మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలు పూర్తయ్యాక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.
రామ్ తాళ్లూరి ఈ చిత్రానికి నిర్మాత. వక్కంతం వంశీ ఈ మూవీకి రచయితగా పనిచేస్తున్నారు. తాజాగా పవన్ కి బర్త్ డే విషెష్ తెలియజేస్తూ ప్రీ లుక్ లాంటి పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్ లో 'యథా కాలం.. తథా వ్యవహారమ్' అనే లైన్ ఉంది. దీనితో పాటు చార్మినార్, సైబర్ టవర్స్ కనిపించేలా హైదరాబాద్ నగరం.. దానిపైన తుపాకీ చూపిస్తూ పోస్టర్ ఉంది. మొత్తంగా పోస్టర్ ని సినిమా థీమ్ తెలియజేసేలా తీర్చిదిద్దారు.
పోస్టర్ ని చూడగానే యాక్షన్ మసాలా చిత్రాన్ని వండుతున్నారని ఇట్టే పసిగట్టేయొచ్చు. ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తి పెంచేలా ఉంది. ఈ చిత్రాన్ని సంబందించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో తెలియనున్నాయి.