Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ అడుగుపెడితే రికార్డులే... ఎవరు మీలో కోటీశ్వరులు షోతో జెమినీ నంబర్స్ మార్చేశాడుగా!

బిగ్ బాస్ రియాలిటీ షో హోస్ట్ గా సక్సెస్ సాధించిన ఎన్టీఆర్, ఆ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. ఎవరు మీలో కోటీశ్వరులు గేమ్ షోతో మరోసారి బుల్లితెరపై తన మార్క్ మ్యాజిక్ సృష్టించాడు.

ntr hosting evaru meelo koteeswarulu gets record trp here are details
Author
Hyderabad, First Published Sep 3, 2021, 3:28 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై కూడా తానేమిటో నిరోపిస్తున్నారు. తాను అడుగుపెడితే ఎక్కడైనా రికార్డుల మోతే అని రుజువు చేస్తున్నారు.  జెమిని టివిలో ఎన్టీఆర్ హోస్ట్ గా మొదలైన సరికొత్త షో ఎవరు మీలో కోటీశ్వరులు తో రికార్డు టీఆర్పీ రాబట్టారు. గతంలో బిగ్ బాస్ రియాలిటీ షో హోస్ట్ గా సక్సెస్ సాధించిన ఎన్టీఆర్, ఆ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. ఎవరు మీలో కోటీశ్వరులు గేమ్ షోతో మరోసారి బుల్లితెరపై తన మార్క్ మ్యాజిక్ సృష్టించాడు.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ మూవీలో భీం, అల్లూరి పాత్రలు చేస్తున్న ఎన్టీఆర్, చరణ్ మొదటి ఎపిసోడ్ లో అలరించారు. ఎవరు మీలో కోటీశ్వరులు  షో కర్టెన్-రైజర్ ఎపిసోడ్‌ కు రామ్ చరణ్ ప్రత్యేక అతిథిగా హాజరు కాగా మంచి రేటింగ్ దక్కింది. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా చేస్తున్న షోకు చరణ్ ముఖ్య అతిథిగా రావడం అందరిలో ఆసక్తిని పెంచేసింది. తాజాగా ఈ షో రేటింగ్స్ వచ్చాయి. ఎవరు మీలో కోటీశ్వరులు మొదటి ఎపిసోడ్‌కు 11.4 రేటింగ్ వచ్చింది. వారంలో ఈ షో సగటు రేటింగ్ 5.6. ఎన్టీఆర్ మ్యాజిక్ బాగా పని చేయడంతో జెమిని టీవీ 290 జిపిఆర్ నుండి 400 జిపిఆర్ కు వెళ్లింది.


ఇక 2014లో మీలో ఎవరు కోటీశ్వరుడు అనే పేరుతో ఈ షోను కింగ్ నాగార్జున హోస్ట్ చేసేవారు. ఆ కార్యక్రమం ప్రారంభ ఎపిసోడ్ కు 9.7 టిఆర్పీని తెచ్చుకుంది. అయితే ఎన్టీఆర్ వెర్షన్ నాగార్జున వెర్షన్ కంటే మెరుగైన రేటింగ్స్ పొందింది. మరి రాబోయే రోజుల్లో ఈ షో ఊపందుకుంటుందో లేదో చూడాలి. ఇక సెప్టెంబర్ 5నుండి ప్రారంభం కానున్న బిగ్ బాస్ షోకి కూడా ఎవరు మీలో కోటీశ్వరులు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ షో దృష్టిలో పెట్టుకొని, బిగ్ బాస్ నిర్వాహకులు గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios