Asianet News TeluguAsianet News Telugu

మేజర్ సినిమాపై స్పందించిన వీవీఎస్ లక్ష్మణ్, ట్విట్టర్ లో ఏమన్నారంటే..?

మేజర్ సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోంది. వరుసగా ఫిల్మ్ సెలబ్రిటీలు ఈ సినిమాపై స్పందిస్తున్నారు. రీసెంట్ గా ఈమూవీ గురించి ట్వీట్ చేశారు వివిఎస్ లక్ష్మణ్. 
 

NCA Chief vvs Laxman Review of Major Film
Author
Hyderabad, First Published Jun 22, 2022, 2:26 PM IST


మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోగ్రఫీ ఆధారంగా తీసిన సినిమా మేజర్. 2008లో ముంబైలోని తాజ్ ప్యాలస్ పై ఉగ్రవాదులు విరుచుకుపడడం తెలిసిందే. నాడు ఉగ్రవాదులపై పోరాటంలో భాగంగా కాల్పుల్లో మేజర్ ఉన్నికృష్ణన్ ప్రాణాలు విడిచారు. దీన్ని కథగా మలిచి, తానే ఆ పాత్రలో నటించాడు అడివి శేష్. ఇదొక యాక్షన్ డ్రామా ఆధారిత సినిమా. జూన్ 3న ఈ సినిమా విడుదల కాగా, సానుకూల స్పందన అందుకుంది. శశికిరణ్ టిక్కా దీనికి దర్శకత్వం వహించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.

మేజర్ సినిమాకు ఎంతో మంది సెలబ్రిటీలు మద్దతు పలికారు. స్ఫూర్తినిచ్చే ఈ సినిమాను చూడాలంటూ పిలుపునిచ్చారు. మాజీ టీమిండియా క్రికెటర్, నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ సైతం మేజర్ సినిమాను చూసి, తన స్పందనతో ఓ ట్వీట్ చేశాడు.

ఇప్పుడే మేజర్ సినిమాను చూశాను. ఇదొక సినిమా కాదు. ఇదొక భావోద్వేగం. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కు సంబంధించి స్ఫూర్తినిచ్చే కథనం. అది మీ భావాలను తాకుతుంది. అడివి శేష్ గొప్పగా చేశాడు. దీన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. తప్పకుండా చూడండి అంటూ లక్ష్మణ్ ట్వీట్ చేశాడు. మేజర్ సినిమా పోస్టర్ ను సైతం పోస్ట్ చేశాడు. 

 

ఇక రీసెంట్ గా  మేజర్ చిత్ర యూనిట్ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలుసుకుంది. టీమ్ సభ్యులతో పాటు ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. యోగి కోసం వీరు ప్రత్యేక షో వేశారు. సినిమాను చూస్తూ యోగి భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం అందరినీ యోగి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమాను చాలా బాగా తెరకెక్కించారని ప్రశంసించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఉన్నికృష్ణన్ వారసత్వాన్ని యూపీ యువతలోకి తీసుకెళ్తామని చెప్పారు.

ఇండియా అంతటా ఉత్కంఠతో ఎదురు చూసిన మోస్ట్ అవెయిటెడ్ మూవీ మేజ‌ర్ మూవీ.. సక్సెస్ సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు.  26/11 ముంబై ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజ‌ర్ సందీప్ ఉన్ని క్రిష్ణ‌న్ నిజమైన నివాళిగా ఈసినిమా నిలిచిందన్న అభిప్రాయం వ్యాక్తం అవుతోంది.   టాలీవుడ్  హీరో అడివి శేష్ టైటిల్ రోల్ పోషించాడు. శ‌‌శి కిరణ్ టిక్కా డైరెక్ట్ చేసిన ఈసినిమా లో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. 

ఇక  ముందు మేజర్ టీమ్ కేంద్ర ర‌క్ష‌ణ‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ను కూడా మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. మేజ‌ర్‌ సినిమా ట్రైల‌ర్‌ను రాజ్‌నాథ్ వీక్షించారు. ఇండియా గ్రేట్ హీరో క‌థ‌ను తెర‌కెక్కిస్తున్న డైరెక్ట‌ర్ శశిక‌ర‌ణ్, అడివి శేష్‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఇక సినిమా రిలీజ్ తరువాత మెగాస్టార్ చిరంజీవి తదితరులు ఈసినిమా చూసి టీమ్ పై ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్  అడివి శేష్ టీమ్ ను అభినందించారు. ఇక ఇప్పడు లక్ష్మణ్ కూడా ఈమూవీపై ట్వీట్ చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios