Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో ప్రముఖ సినీనటి కుమారుడికి కరోనా!

దిల్ సుఖ్ నగర్ పరిధిలోని తిరుమలానగర్ లోని  ఓ అపార్టు మెంట్ లో 9 మంది కరోనా పాజిటివ్ గా తేలారు. వీరిలో ఓ ప్రముఖ సినీనటి కుమారుడు కూడా ఉన్నారని సమాచారం. ఇటీవల తన అత్తగారింటికి వచ్చిన ఈయన, వైరస్ బారిన పడటంతో, ఆ అపార్టుమెంట్ లో నివాసం ఉంటున్న 27 మందినీ వైద్యులు పరీక్షల నిమిత్తం తరలించారని తెలుస్తోంది. కాగా, ప్రభుత్వం విధించిన సమాచార గోప్యత నిమిత్తం ఎవరి పేర్లనూ అధికారులు వెల్లడించడం లేదన్న సంగతి తెలిసిందే. 

Movie senier artist son got Corona in hyderabad
Author
Hyderabad, First Published May 12, 2020, 12:45 PM IST

హైదరాబాద్ నగరంలో మరోమారు కరోనా విజృంభించిన సంగతి తెలిసిందే. అందరూ ఎలర్ట్ గా ఉన్నా..ఎక్కడో చోట కేసులు కనపడుతూనే ఉన్నాయి.  సోమవారం నాడు ఏకంగా 79 కేసులు నమోదు కాగా, వీటిల్లో మూడోవంతు జియాగూడలోనే నమోదయ్యాయి. దిల్ సుఖ్ నగర్ పరిధిలోని తిరుమలానగర్ లోని  ఓ అపార్టు మెంట్ లో 9 మంది కరోనా పాజిటివ్ గా తేలారు. వీరిలో ఓ ప్రముఖ సినీనటి కుమారుడు కూడా ఉన్నారని సమాచారం. 

ఇటీవల తన అత్తగారింటికి వచ్చిన ఈయన, వైరస్ బారిన పడటంతో, ఆ అపార్టుమెంట్ లో నివాసం ఉంటున్న 27 మందినీ వైద్యులు పరీక్షల నిమిత్తం తరలించారని తెలుస్తోంది. కాగా, ప్రభుత్వం విధించిన సమాచార గోప్యత నిమిత్తం ఎవరి పేర్లనూ అధికారులు వెల్లడించడం లేదన్న సంగతి తెలిసిందే. 

మరో ప్రక్క హైదరాబాద్ జియాగూడ ప్రాంతంలో ఇప్పటివరకూ 68 కేసులు రాగా, సోమవారం నాడే 25 వచ్చాయి. దీంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించి, కంటైన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. మలక్ పేటలో పనిచేస్తున్న ఓ మహిళకు, సికింద్రాబాద్ లోని ఓ డయాగ్నస్టిక్ సెంటర్ లో పనిచేస్తున్న ఆమె కుమార్తెకు వ్యాధి సోకింది. వెంటనే సదరు సెంటర్ ను అధికారులు మూసివేయించి, ఉద్యోగులను క్వారంటైన్ చేశారు. మూసాపేట, యూసుఫ్ గూడ, చాదర్ ఘాట్, మలక్ పేట, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లోనూ కొత్త కేసులు నమోదయ్యాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios