Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ బిగ్ బాస్ చేయనన్నందుకు చాలా హ్యాపీ అని.. అనలేదంటోంది

  • ఎన్టీఆర్ బిగ్ బాస్ చేయనన్నందుకు చాలా హ్యాపీగా వుందన్న మానస్
  • మానస కమెంట్స్ పై మండి పడుతున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్
  • బిగ్ బాస్  షో గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంపై ఆగ్రహం
manasa himavarsha negative comment on ntr big boss created attention

ఈ ఆదివారంతో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బుల్లితెర మీద ఆరంగేట్రం చేస్తున్న బిగ్ బాస్ షో గ్రాండ్ గా లాంచ్ అయింది. స్టార్ మా ఛానెల్ 14 మంది కంటెస్టంట్స్ తో లాంచ్ చేసిన ఈ షోకి సెలక్షన్స్ టైంలో చాలా మందిని ఆడిషన్స్ జరిపారు. అందులో రొమాన్స్ బ్యూటీ మానస్ హిమవర్ష కూడా ఉందని అప్పట్లో వార్తలొచ్చాయి. ఇక నిన్న మొదటి ఎపిసోడ్ టెలికాస్ట్ అవడంతో ఆ షోలో తాను లేనందుకు సంతోషిస్తున్నా అంటూ కామెంట్ పెట్టింది.

 

ఎన్.టి.ఆర్ లాంటి స్టార్ హీరో షో మీద చేసిన మొదటి నెగటివ్ కామెంట్ కావడంతో అందరి ఫోకస్ ఆమె మీద పెట్టారు. ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ అయితే ఆమె మీద మాటల యుద్ధానికే దిగారు. అయితే తాను షో చేయడానికి ఇష్టపడలేదని.. ఎన్.టి.ఆర్ తనకు ఇష్టమైన హీరో అని మళ్లీ కవర్ చేస్తుంది. బిగ్ బాస్ లో పాటిస్పేట్ చేసేందుకు మానసని కలిశారట బిగ్ బాస్ టీం.

 

అయితే ఆమె మాత్రం షో చేయడానికి నిరాకరించిందట. కారణాలు తెలియవు కాని మానస బిగ్ బాస్ ను కాదన్న విషయం ఇప్పుడు హైలెట్ అయ్యింది. తన కామెంట్ షో మీద చేసినా ఆమె మాత్రం ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కు మండేలా చేసింది. అందుకే ఆమెని ట్విట్టర్ లో చెడామడా తిట్టేస్తున్నారు తారక్ అభిమానులు. 

 

అందరికి పరిచయం ఉన్న వ్యక్తులనే బిగ్ బాస్ హౌజ్ లోకి స్వాతగించాడు ఎన్.టి.ఆర్. షో మొదటి రోజు సూపర్ సక్సెస్ అంతేకాదు. వారిని ఉత్సాహ పరిచేందుకు తారక్ చేసిన హోస్టింగ్ టెక్నిక్స్ సూపర్ అని చెప్పాలి. ఏది ఏమైనా బిగ్ బాస్ మొదటి ఎపిసోడ్ తోనే వివాదాస్పదంగా మారాలని చేసిన మానస విమర్శలు ఎదుకు కావడంతో ఇప్పుడు మాట మార్చింది.

 తాను కేవలం బిగ్‌బాస్ షో గురించే కామెంట్ చేశానని, ఎన్టీఆర్‌ను కించపరచలేదని ఆమె చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్‌ను కించపరిచానంటూ తన వ్యాఖ్యలను వక్రీకరించొద్దని ఆమె కోరారు.

 

తాను ఇదంతా పబ్లిసిటీ కోసం చేయలేదని, రాత్రికి రాత్రే పాపులర్ అవ్వాలనే ఆలోచన తనకు లేదని, కాంట్రవర్సీలకు తాను ఎల్లప్పుడూ దూరంగా ఉంటానని, తన పని తాను చేసుకుంటూ ప్రశాంతగా ఉంటానని హిమవర్ష పేర్కొంది. పబ్లిసిటీ కోసం ఆమె ఇలా చేస్తోందని విమర్శలు రావడంతో ఆమె ఈ క్లారిటీ ఇచ్చింది.

 

రొమాన్స్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన మానస హిమవర్షి ఆ తర్వాత ‘కాటమరాయుడు’ సినిమాలో శివబాలాజీకి జంటగా కనిపించింది . ఇటీవల విడుదలైన వంశీ ‘ఫ్యాషన్ డిజైనర్‌’లో కూడా మానస నటించింది.

Follow Us:
Download App:
  • android
  • ios