త్రివిక్రమ్తో సినిమా.. మహేష్తో మరోసారి పూజా హెగ్డే..
మహేష్ బర్త్ డే సందర్భంగా త్రివిక్రమ్తో చేస్తున్న `SSMB28` చిత్రం నుంచి వీడియో విడుదల చేస్తూ ఫ్యాన్స్ ని ఖుషీ చేశారు. ఇందులో హీరోయిన్గా మరోసారి పూజా హెగ్డేని ఫైనల్ చేశారు.
మహేష్బాబు, త్రివిక్రమ్ సినిమా అప్డేట్ వచ్చింది. నెక్ట్స్ నటించబోతున్న సినిమాలోని కాస్ట్ అండ్ క్రూని ప్రకటించింది యూనిట్. మహేష్ బర్త్ డే సందర్భంగా త్రివిక్రమ్తో చేస్తున్న `SSMB28` చిత్రం నుంచి వీడియో విడుదల చేస్తూ ఫ్యాన్స్ ని ఖుషీ చేశారు. ఇందులో హీరోయిన్గా మరోసారి పూజా హెగ్డేని ఫైనల్ చేశారు. `మహర్షి` చిత్రం తర్వాత మహేష్తో పూజా జోడీ కట్టబోతుంది. దీంతోపాటు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తుననట్టు ప్రకటించారు.
సూపర్స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ప్రచారం చిత్రంలో ఈ విషయాలను వెల్లడించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ(చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా ఎంపిక అయ్యారు. కళా దర్శకునిగా ఎ.ఎస్. ప్రకాష్ , కెమెరామెన్గా మధీని ఎంపిక చేశారు.
`ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చిత్రం షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది, మరిన్ని ఇతర వివరాలు త్వరలో మరో ప్రకటనలో తెలియ పరుస్తామ`ని చిత్ర నిర్మాత ఈ సందర్భంగా తెలిపారు. మహేష్-త్రివిక్రమ్ల హ్యాట్రిక్ మూవీగా రూపొందే ఈ చిత్రానికి సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ అంశాలు వివరాలు త్వరలో తెలుస్తాయి. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పి.డి.వి. ప్రసాద్.