'సర్కార్ వారి పాట' షూటింగ్ ముహూర్తం ఫిక్స్
సూపర్స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు పరశురామ్ తెరకెక్కించబోతున్న చిత్రం `సర్కారు వారి పాట`. టైటిల్తోనే ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చేసింది. ఇటీవల విడుదలైన ఫస్ట్లుక్.. సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేసింది.
మొత్తానికి సూపర్ స్టార్ మహేష్ బాబు తన తర్వాత ప్రాజెక్ట్ ను మొదలుపెట్టడానికి రంగం సిద్దమైంది. దర్శకుడు పరశురామ్ తో “సర్కారు వారి పాట” అనే టైటిల్ తో సినిమాను మొదలు పెట్టి మరో హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. మహేష్ అభిమానులు ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అయితే ప్రస్తుతం కరోనా తో షూటింగ్స్ ఏమీ జరగలేదు. దాంతో ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయమై అనేక చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్నదాని ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూట్ సెప్టెంబర్ రెండవ వారం నుంచి ప్రారంభం కానుంది. అప్పటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గుతుందని అంచనా వేసి,అప్పుడు షూట్ ఫిక్స్ చేసారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ సంగతి వినిపిస్తోంది. అదేమిటంటే ఈ సినిమా ఒక రివెంజ్ డ్రామాగా ఉండనుంది అని చెప్తున్నారు. అలాగే ఈ సినిమాలో మహేష్ ఫైనాన్సియర్గా కనిపించబోతున్నాడట. అవసరమైన వాళ్లకి అప్పులిచ్చి, తిరిగి కచ్చితంగా వసూలు చేసుకునే వ్యక్తి పాత్రలో కనిపించబోతున్నాడట. ఈ క్రమంలోనే హీరోయిన్ పరిచయయం అవుతుందిట. నిజానికి ఈ సినిమాను అమెరికాలో తెరకెక్కించాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే కరోనా కారణంగా అక్కడ షూటింగ్ వీలు కాకాపోవడంతో గోవా లొకేషన్ లో చేయబోతున్నారు. మహేష్ తన కెరీర్ లో ఇలాంటి ఫన్ తో కలిసిన ఇలాంటి పాత్ర చేయలేదు. అలాగే తన గత మూడు సినిమాలతో సమాజానికి సందేశం ఇచ్చేందుకు ప్రయత్నించిన మహేష్ ఈ సినిమా ద్వారా కూడా ఓ స్ట్రాంగ్ మెసేజ్ ను ఇవ్వనున్నారని వినికిడి.
“14 రీల్స్ మరియు మైత్రి మూవీ మేకర్స్” కలిసి ఈ సినిమా ని నిర్మించనున్నారు.సంగీతం తమన్ అందించబోతున్నాడట. అలాగే చాలా కాలం తర్వాత మహేష్ రొమాంటిక్ బాయ్ గా నటించబోతున్నాడు. మహేష్ ను ఒక మ్యాచుర్డ్ లవ్ స్టోరీలో చూపించబోతున్నట్లు సమాచారం. అలాగే ఈ సినిమాలో ఉపేంద్ర విలన్ గా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ బయటకు రానుంది.