‘సర్కారు వారి పాట’:వైరల్ అవుతున్న మహేష్ ఫొటో !
పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. కీర్తీ సురేశ్ హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ 26న దుబాయ్లో ప్రారంభం అయ్యింది.
సూపర్స్టార్ మహేశ్ తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరుశురాం దర్శకత్వం వహిస్తున్నారు. బ్యాంక్ స్కామ్ల ఆధారంగా రూపొందే ఈ సినిమా షూటింగ్ దుబాయిలో ఇప్పటికే మొదలై జరుగుతోంది. దుబాయ్ హాలీడేస్ కు వెల్లిన సంగీత దర్శకుడు తమన్ ..ఆ సెట్స్ కు వెళ్లి ఓ ఫొటో షేర్ చేసారు. ఆ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోని చాలా జాగ్రత్తగా తీసారు. మహేష్ బాబు గెటప్ ఆ సినిమా లో ఏమిటనేది రివీల్ కాకుండా ఈ ఫొటో ఉంది. వెనక నుంచి ఉన్న ఈ ఫొటో, మాస్క్, సన్ గ్లాస్ లతో మహేష్ ఉన్నారు.
ఇక ఈ సినిమా చాలా కాలం క్రితమే..షూటింగ్ మొదలు కావాల్సి ఉంది. అయితే కోవిడ్ ప్రభావంతో లేటైంది. వాస్తవానికి తొలి షెడ్యూల్ను హైదరాబాద్లోనే చేయాలని మొదట అనుకొన్నా, ప్లానింగ్లో మార్పు జరిగి, దుబాయ్కు వెళ్లింది చిత్రటీమ్. ఇక అక్కడే దాదాపు 20 రోజుల పాటు అక్కడ షూటింగ్ జరుపుకోనుంది.
దుబాయ్లో 20 రోజులు షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత రెండో షెడ్యూల్ హైదరాబాద్లో జరగనుంది. అంతేకాదు హైదరాబాద్ షెడ్యూల్లో భాంగంగా ఫిల్మ్ సిటీలో ఓ సాంగ్ ను షూట్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా దీనికి సంబంధించిన సెట్ వర్క్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఆర్ట్ డైరెక్టర్ తోట తరుణి ఆధ్వర్యంలో ప్రత్యేకమైన ఈ టైటిల్ సాంగ్ సెట్ తీర్చిదిద్దారప. ఈ పాట టైటిల్ సాంగ్ వస్తోందని వినికిడి. ఈ భారీ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్, మహేశ్ బాబు సొంతంగా నిర్మిస్తుండగా లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఎస్.ఎస్. సంగీతం అందిస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ... ‘‘సర్కారు వారి పాట’ మూవీ రెగ్యులర్ షూటింగ్ దుబాయ్లో జరుగుతోంది. సూపర్స్టార్ మహేశ్బాబును డైరెక్ట్ చేయాలన్న ఇన్నేళ్ళ నా కల ఈ రోజు నిజమైంది. మహేష్ బాబుతో కలిసి పనిచేయడం చాలా ఎగ్జైటింగ్గా ఉంది.
ఈ మూవీని ఒక ఛాలెంజింగ్ తీసుకుని చేస్తున్నాను. డెఫినెట్గా ప్రేక్షకులు, మహేష్ బాబు అభిమానుల అంచనాలకు తగినట్లుగా ఈ సినిమా పెద్ద స్థాయిలో ఉంటుంది. ఇరవై రోజుల పాటు దుబాయ్లో ఫస్ట్ షెడ్యూల్ జరగనుంది. ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’ అంటూ చెప్పుకొచ్చారు.
బ్యాంకింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ ఈ కథ సాగుతుందని సమాచారం. కాగా మహేశ్బాబు సరసన కీర్తీ సురేశ్ మొదటిసారి నటిస్తున్నారు. ఇక వెన్నెల కిషోర్, సుబ్బరాజులు కీలక పాత్రలో కనిపించన్నారు. అంతేగాక ఇతర భారీ తారాగణం నటిస్తున్నఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: మధి, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్: ఏ ఎస్ ప్రకాష్, ఫైట్ మాస్టర్: రామ్ - లక్ష్మణ్, పిఆర్ఓ: బి.ఏ.రాజు, లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్, కో డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్, సీఈఓ: చెర్రీ, నిర్మాతలు: నవీన్ ఎర్నేని , రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట,రచన, దర్శకత్వం: పరశురామ్ పెట్ల.