Asianet News TeluguAsianet News Telugu

`లైగర్‌` బ్యూటీ అనన్య పాండేకి ఎన్సీబీ షాక్‌.. డ్రగ్స్ కేసులో నోటీసులు..

మరోవైపు తాజాగా యంగ్‌ సెన్సేషన్‌ అనన్య పాండే ఇంట్లోనూ ఎన్సీబీ అధికారులు సోదాలు చేయడం కలకలం సృష్టిస్తుంది. ఆమెని విచారణకు హాజరు కావాలని యాంటీ డ్రగ్స్ ఏజెన్సీ నోటీసులివ్వడం సంచలనంగా మారింది. 

liger heroine ananya panday raided bt ncb officers and give notice for questioning
Author
Hyderabad, First Published Oct 21, 2021, 1:19 PM IST

`లైగర్‌` బ్యూటీ అనన్య పాండేకి ఎన్సీబీ అధికారులు షాకిచ్చారు. ఊహించని విధంగా ఆమె ఇంట్లో గురువారం సోదాలు  నిర్వహించారు. అంతేకాదు డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు బాలీవుడ్‌లో కలకలం సృష్టిస్తుంది. బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. షారూఖ్‌ ఖాన్ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ ఇటీవల రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుపడ్డట్టు ఆరోపిస్తూ ముంబయి పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జైల్లో పోలీసుల కస్టడీలోనే ఉన్నారు. విచారణ ఎదుర్కొంటున్నారు. 

మరోవైపు తాజాగా యంగ్‌ సెన్సేషన్‌ Ananya Pandayఇంట్లోనూ Ncb అధికారులు సోదాలు చేయడం కలకలం సృష్టిస్తుంది. ఆమెని విచారణకు హాజరు కావాలని యాంటీ డ్రగ్స్ ఏజెన్సీ నోటీసులివ్వడం సంచలనంగా మారింది. అయితే గురువారం నిర్వహించిన raidsలో అనన్య పాండే ఇంట్లోనే కాదు, షారూఖ్‌ ఖాన్‌ ఇంట్లోనూ ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించడం ఇప్పుడు మరింత హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

ఈ రోజు ఉదయమే Shah Rukh Khan తనయుడు Aryan Khanని కలిశాడు. ముంబయిలోని ఆర్థర్‌ జైల్లో ఉన్న కొడుకుని షారూఖ్‌ కలిశాడు. దాదాపు అరగంటపాటు కొడుకుతో షారూఖ్‌ ముచ్చటించాడట. ఆ వెంటనే ఇప్పుడు షారూఖ్ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించడం మరింత చర్చనీయాంశంగా మారుతుంది. అభిమానులను ఆందోళనకి గురి చేస్తుంది. ఆర్యన్‌ ఖాన్‌ క్రూజ్‌ Drugs Caseలో జైలు జీవితాన్ని గడుపుతున్నారు‌. 

ఇక అనన్య పాండే ప్రస్తుతం తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ విజయ్ దేవరకొండ సరసన `లైగర్‌` చిత్రంలో నటిస్తుంది. పాన్ ఇండియా చిత్రంగా ఇది రూపొందుతుంది. పూరీ జగన్నాథ్‌ దర్శకుడు. ఛార్మి, పూరీ, కరణ్‌ జోహార్‌ దీన్ని నిర్మిస్తున్నారు. బాక్సింగ్‌ నేపథ్యంలోసాగే ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అనన్య పాండే .. బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు చుంకీ పాండే తనయ అనే విషయం తెలిసిందే. 2019లో `స్టూడెంట్ ఆఫ్‌ ది ఇయర్‌ 2` చిత్రంతో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే. 

also read: కొడుకు ఆర్యన్ ఖాన్ కోసం జైలుకి వచ్చిన షారుక్!

ఆ తర్వాత `పతి పత్ని ఔర్‌ వాహ్‌` తో మంచివిజయాన్ని అందుకుంది. అలాగే గతేడాది `అంగ్రేజీ మీడియం`లో స్పెషల్‌ సాంగ్‌లో మెరిసింది. దీంతోపాటు `ఖాలీ పీలీ` చిత్రంలో హీరోయిన్‌గా మెప్పించింది. బాలీవుడ్‌లో శకున్‌ బత్రా చిత్రంలో, అలాగే `లైగర్‌`లో ప్రస్తుతం నటిస్తుంది అనన్య. తాజాగా ఆమెపై డ్రగ్స్ ఆరోపణలు రావడం, ఎన్సీబీ అధికారులు సోదాలు చేయడం `లైగర్‌` యూనిట్‌ని సైతం ఆందోళనకి గురి చేస్తుంది. 

also read: బ్రేకింగ్ : మళ్ళీ నిరాశే.. ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ రిజెక్ట్ చేసిన కోర్టు

Follow Us:
Download App:
  • android
  • ios