Asianet News TeluguAsianet News Telugu

ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు లెజెండ్స్... చిరుతో కపిల్!

చిరంజీవి దంపతులు కపిల్ దేవ్ తో భేటీ కావడం జరిగింది. ప్రముఖ ఫలక్ నుమా ప్యాలస్ వీరి భేటీకి వేదిక కావడం జరిగింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. 

legendary cricketer kapil dev met with chiranjeevi in hyderabad
Author
Hyderabad, First Published Aug 30, 2021, 7:43 AM IST


లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ హైదరాబాద్ లో సందడి చేశారు. చిరంజీవి దంపతులు కపిల్ దేవ్ తో భేటీ కావడం జరిగింది. ప్రముఖ ఫలక్ నుమా ప్యాలస్ వీరి భేటీకి వేదిక కావడం జరిగింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. కపిల్ దేవ్ తో తాను దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాటు, తన ఆనందం కామెంట్స్ రూపంలో తెలియజేశారు. 


చాలా కాలం తరువాత నా మిత్రుడు కపిల్ దేవ్ ని కలవడం అద్భుతంగా ఉంది. ప్రఖ్యాత ఫలక్ నుమా ప్యాలస్ మా మీటింగ్ ని మరింత ఉన్నతంగా మార్చింది. అనేక విషయాలు చర్చించుకోవడంతో పాటు, పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నాం. హర్యానా హరికేన్ గా పిలవబడే కపిల్ దేశానికి మొదటి వరల్డ్ కప్ అందించారు... అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. 


చిరంజీవి ట్వీట్ ద్వారా గతంలో కపిల్ దేవ్, చిరంజీవి మధ్య మంచి స్నేహం ఉండేదని అర్థం అవుతుంది. ఇక కపిల్ దేవ్ తో చిరంజీవి దిగిన ఫోటోలు ట్విట్టర్ లో పంచుకోగా వైరల్ గా మారాయి. కాగా కపిల్ దేవ్ బయోపిక్ 83 అనే టైటిల్ తో తెరకెక్కుతుండగా, రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తున్నారు.  మరోవైపు చిరంజీవి వరుస చిత్రాలు ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 


ఆచార్య అనంతరం చిరంజీవి నుండి లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్.. మెహర్ రమేష్ చిత్రం భోళా శంకర్ లతో పాటు బాబీ దర్శకత్వంలో మరో మూవీ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. భోళా శంకర్ చిత్రం కూడా రీమేక్ కావడం విశేషం. 2015లో అజిత్ హీరోగా దర్శకుడు శివ తెరకెక్కించిన మాస్ ఎంటర్టైనర్ వేదాళం కి భోళా శంకర్ ఆఫీషియల్ రీమేక్. ఈ మూవీలో చిరు చెల్లి పాత్రను కీర్తి సురేష్ చేయడం మరో విశేషం. 

Follow Us:
Download App:
  • android
  • ios