బ్యాక్ టూ బ్యాక్ ప్రియాంక జవాల్కర్ హంగామా.. `ఎస్ఆర్ కళ్యాణమండపం`లోనూ రచ్చ
ప్రియాంక జవాల్కర్.. కిరణ్ అబ్బవరంతో కలిసి నటించిన `ఎస్ఆర్ కళ్యాణమండపం EST 1975` చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. ఆగస్ట్ 6న ఈ సినిమాని థియేటర్లో రిలీజ్ చేయబోతున్నారు.
`టాక్సీవాలా` భామ ప్రియాంక జవాల్కర్ బ్యాక్ టూ బ్యాక్ సందడి చేయబోతుంది. ఆడియెన్స్ ని తన అందాలతో కనువిందు చేసేందుకు రెడీ అవుతుంది. ఓ వైపు `తిమ్మరుసు` మరోవైపు `ఎస్ఆర్ కళ్యాణ మండపం`లో ఆమె అలరించనుంది. దీంతోపాటు `గమనం`సినిమాతో రానుంది. తాజాగా కిరణ్ అబ్బవరంతో కలిసి నటించిన `ఎస్ఆర్ కళ్యాణమండపం EST 1975` చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. ఆగస్ట్ 6న ఈ సినిమాని థియేటర్లో రిలీజ్ చేయబోతున్నారు.
తాజాగా బుధవారం ఈ చిత్ర ట్రైలర్ని విడుదల చేశారు. ఇందులో కీలక పాత్రలో నటించిన సాయి కుమార్ గెస్ట్ గా వచ్చి ట్రైలర్ని విడుదల చేశారు. తండ్రి కొడుకుల మధ్య సంఘర్షణ ఆకట్టుకుంటుంది. ఇందులో ప్రియాంక చేసిన రచ్చ మామూలుగా లేదు.
`సినీ జీవితాన్ని మలుపు తిప్పిన సినిమాలు చాలా ఉన్నాయి. వాటిలో `పోలీస్ స్టోరీ`, `ప్రస్థానం` చిత్రాలు నాకు ఓ ప్రత్యేకమైన గుర్తింపును ఇచ్చాయి. నా యాభై ఏళ్ల సినీ జీవితంలో నేను ఇప్పటి వరుకు పోషించిన పాత్రలు నా ఫస్ట్ ఇన్నింగ్స్ కి వైభవాన్ని తీసుకొస్తే నా సెకండ్ ఇన్నింగ్స్ కి అద్భుతమైన గుర్తింపును తీసుకొచ్చే సినిమాగా `SR కళ్యాణమండపం EST 1975` అవ్వడం ఖాయం. హీరో కిరణ్ అబ్బవరం చాలా ఫోకస్ డ్ గా పనిచేస్తూ ఉంటాడు, ఈ సినిమాతో కిరణ్ మంచి పేరు, గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను, అలానే ప్రేక్షకుల మా ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూసి ప్రోత్సహించాలని ప్రార్థిస్తున్నాను` అని సాయికుమార్ అన్నారు.
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, `కుటంబ సమేతంగా చూడదగ్గ సినిమా మా `SR కళ్యాణమండంపం EST 1975`. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. నేను థియేటర్లలో, టీవీల్లో చూసిన సాయికుమార్ వంటి గొప్ప నటులు పక్కన నేను నటించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమాను నమ్మి ఈ చిత్రానికి సంబంధించిన రైట్స్ తీసుకున్న శంకర్ పిక్చర్స్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేనే కథ చెప్పగానే నన్ను నమ్మిన ఎలైట్ ఎంటర్ టైన్మెంట్స్ అధినేతలు ప్రమోద్, రాజులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. వారి ప్రోత్సాహం లేకపోతే ఈ సినిమా ఇలా వచ్చేది కాదు.
దర్శకుడు శ్రీధర్ ఈ సినిమా ఆద్యంతం అలరించే రీతిన తీర్చిదిద్దారు. మేమంతా చేసిన ఈ ప్రయత్నాన్ని ఆగస్ట్ 6న థియేటర్లకి వచ్చి ప్రేక్షకులు ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాన` అని అన్నారు. ఎలైట్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై ప్రమోద్ - రాజు ఈ సినిమాని నిర్మించారు. శంకర్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రానికి సంబంధించిన వరల్డ్ వైడ్ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకి దక్కించుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.