ఖైదీ దర్శకుడితో కమల్232 .. ఆసక్తి రేకెత్తిస్తున్న పోస్టర్
విశ్వ నటుడు కమల్హాసన్ తన నెక్ట్స్ సినిమాని ప్రకటించారు. ఆయన `మాస్టర్`, `ఖైదీ` వంటి బ్లాక్ బస్టర్స్ ని రూపొందించిన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తన 232వ సినిమా చేస్తున్నారు.
విశ్వ నటుడు కమల్హాసన్ తన నెక్ట్స్ సినిమాని ప్రకటించారు. ఆయన `మాస్టర్`, `ఖైదీ` వంటి బ్లాక్ బస్టర్స్ ని రూపొందించిన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తన 232వ సినిమా చేస్తున్నారు. `కమల్హాసన్ 232`(వర్కింగ్ టైటిట్)గా బుధవారం సాయంత్రం ఈ చిత్రాన్ని ప్రకటించారు కమల్ హాసన్.
ఈ సినిమాని తన రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్నారు కమల్. దీనికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. యూనివర్సల్ హీరోతో లోకేష్ సినిమా చేసే అవకాశం రావడం నిజంగా గొప్ప విషయం. ఈ సందర్భంగా ఓ పోస్టర్ని విడుదల చేశారు. ఇందులో కమల్ షేడ్లో తుపాకులతో నిండి ఉంది. అంతేకాదు `వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ లైవ్డ్ ఏ ఘోస్ట్..(ఒకానొక టైమ్లో దెయ్యం నివసించేది) అని రాసి ఉంది. దీని బట్టి ఇది యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్నట్టు అర్థమవుతుంది. యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలకు లోకేష్ కేరాఫ్. ఆయన రూపొందించిన సినిమాలన్నీ యాక్షన్ థ్రిల్లర్గానే రూపొంది విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఇక `రాజా పార్వై`, `అబూర్వ సగోథిరంఘల్`, `సత్య`, `దేవర్ మాగన్`,`కురుధిపునల్`, `హే రామ్`, `విరుమంది`, `విశ్వరూపం`, `సధి లీలావతి` వంటి బ్లాక్బస్టర్స్ రూపొందించిన రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కడం విశేషం. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. కచ్చితంగా వేసవిలోనే విడుదల చేస్తామని ప్రామిస్ కూడా చేసింది యూనిట్.
ఇక ప్రస్తుతం కమల్ హాసన్.. శంకర్ దర్శకత్వంలో `భారతీయుడు 2`లో నటిస్తున్నారు. కాజల్, రకుల్ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభం నుంచి అనేక ప్రమాదాలు వెంటాడుతున్నాయి. లాక్ డౌన్కి ముందు జరిగిన క్రేజ్ ప్రమాదంలో ముగ్గురు టెక్నీషియన్లు మృత్యువాతపడ్డ విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాపై అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి.