వైసీపీ నేత పై 'కౌన్ బనేగా కరోడ్ పతి'లో అమితాబ్ ప్రశ్న!
వైసీపీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్కు సంబంధించిన ప్రశ్న వచ్చింది. అయితే, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక యూపీలోని బలియాకు చెందిన సోనూ కుమార్ గుప్తా అనే ప్రైవేట్ ఉద్యోగి షో నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. తాజాగా, ఈ షో ప్రసారమైంది. ఇందులో సోనూ కుమార్ 12 ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పి రూ.12.5 లక్షలు గెలుచుకున్నాడు.
కౌన్ బనేగా కరోడ్ పతి.. ప్రోగ్రామ్ ఎంత పాపులరో తెలిసిందే కదా. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన షో ఇది. దీనికి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎవరైనా ఈ షోలో పొల్గొనవచ్చు. షోలో అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెబితే కోట్లలో డబ్బు గెలుచుకోవచ్చు. అలాగే ఈ షోలో అనేక అంశాలపై ప్రశ్నలు అడుగుతుంటారు. సమకాలీన అంశాలు, రాజకీయాలు, సినిమాలు, క్రీడలు, జీకే.. ఇలా పలు అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వైసీపీ నేత గురించిన ప్రశ్న అడిగారు.
వివరాల్లోకి వెళితే... బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో వైసీపీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్కు సంబంధించిన ప్రశ్న వచ్చింది. అయితే, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక యూపీలోని బలియాకు చెందిన సోనూ కుమార్ గుప్తా అనే ప్రైవేట్ ఉద్యోగి షో నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. తాజాగా, ఈ షో ప్రసారమైంది. ఇందులో సోనూ కుమార్ 12 ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పి రూ.12.5 లక్షలు గెలుచుకున్నాడు.
13వ ప్రశ్నకు సమాధానం చెబితే మరో రూ.25 లక్షలు గెలుచుకునేవాడు. 2019లో పి.సుభాష్ చంద్రబోస్ అనే రాజకీయ నాయకుడు ఏ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా పనిచేశారు? అని బిగ్ బీ అడిగారు. ఏపీ, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, కర్ణాటక అనే ఆప్షన్లు ఇచ్చారు. అయితే, సోనూ కుమార్కి దాని సమాధానం తెలియదు. తనకు ఉన్న నాలుగు లైఫ్లైన్లనూ అప్పటికే వినియోగించుకున్నాడు.
దీంతో రిస్క్ వద్దనుకుని క్విట్ అవుతున్నట్లు ప్రకటించి, తాను గెలుచుకున్న రూ.12.5 లక్షల చెక్ తీసుకుని వెళ్లిపోయాడు. అనంతరం ఆ సమాధానం ఏదై ఉంటుందని భావిస్తున్నారని సోనూ కుమార్ను బిగ్ అడిగారు. ఆంధ్రప్రదేశ్ అని సోనూ సరైన సమాధానం చెప్పాడు. అప్పటికే సోనూ క్విట్ కావడంతో ఆ ప్రశ్నకు రావాల్సిన డబ్బు రాలేదు.
అనంతరం ఏపీ ముఖ్యమంత్రి జగన్, పిల్లి సుభాష్ చంద్రబోస్ గురించి అమితాబ్ బచ్చన్ వివరించారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. సీఎం జగన్ కొత్త కేబినెట్లో ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల్ని నియమించారని చెప్పారు. వారిలోనే పి.సుభాష్ చంద్రబోస్ ఉన్నారని చెప్పారు.