విశాల్ జోషి భార్య పూజా కుమార్, కూతురు ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పూజా కుమార్ తల్లిగా మారిన విషయం బయటికి వచ్చింది.
హీరోయిన్ పూజా కుమార్ తల్లైన విషయం కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూజా కుమార్ అమ్మాయికి జన్మనిచ్చారు. ఈ విషయాన్ని పూజా కుమార్ భర్త విశాల్ జోషి తెలియజేశారు. విశాల్ జోషి భార్య పూజా కుమార్, కూతురు ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పూజా కుమార్ తల్లిగా మారిన విషయం బయటికి వచ్చింది.
మిస్ ఇండియా యూఎస్ టైటిల్ అందుకున్న పూజా కుమార్ 2000లో విడుదలైన కాదల్ రోజావే అనే తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. అమెరికాలో పుట్టిపెరిగిన పూజా కుమార్ కొన్ని ఆంగ్ల చిత్రాలలో కూడా నటించడం జరిగింది. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన విశ్వరూపం మూవీలో పూజా కుమార్ నటించారు. దానికి కొనసాగింపుగా వచ్చిన విశ్వరూపం 2లో కూడా పూజ కుమార్ నటించడం జరిగింది.
కమల్ కుటుంబంతో చాలా సన్నితంగా ఉంటున్న పూజా కుమార్ పై కొన్ని ఆరోపణలు వచ్చాయి. కమల్, పూజా కుమార్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు రావడం జరిగింది. కొన్నాళ్ల క్రితం అమెరికాలో స్థిరపడిన విశాల్ జోషిని ఆమె వివాహం చేసుకున్నారు. వీరికి మొదటి సంతానంగా అమ్మాయి పుట్టింది.
.@PoojaKumarNY married! Now, a proud mom!
— sridevi sreedhar (@sridevisreedhar) January 1, 2021
Her husband #VishalJoshi has posted the happy news on his Instagram page
BREAKING: https://t.co/AFcwPVsPN8 pic.twitter.com/QrrMwYOk3W
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 1, 2021, 6:58 PM IST