అవినాష్ ని ఆవహించిన బిగ్ బాస్...మోనాల్ ట్రైయాంగిల్ లవ్ స్టోరీపై దివి ఆసక్తికర వ్యాఖ్యలు
బిగ్ బాస్ 4 ఎపిసోడ్ 34 ఆసక్తికరంగా సాగింది. గంగవ్వ చిన్న వయసులోనే చనిపోయిన తనకు కొడుకు గురించి చెప్పి ఏడవగా, అవినాష్ లోకి బిగ్ బాస్ ప్రవేసించి ఇంటి సభ్యుల ప్రశ్నకు సమాధానం చెప్పాడు. ఇక మోనాల్ లవ్ స్టోరీ గురించి దివి ఆమెతో మాట్లాడింది.
మార్నింగ్ మస్తీలో నియోల్, అవినాష్ కొన్ని భావోద్వేగ విషయాలు పంచుకున్నారు. ఐతే గంగవ్వ చెప్పిన తన కొడుకు కథ అందరిచేత కంట నీరు పెట్టించింది. తనకు ఏళ్లకు కొడుకు పుట్టాడని, కొడుకు పుట్టాక భర్త తాగుడు తాగి కొట్టడం మొదలుపెట్టాడని. ఆ టైంలో మస్కట్కి పోతా డబ్బులు తెమ్మన్నాడు అట. అదే టైంలో ఆమె బిడ్డకు ఫిట్స్ వచ్చాయట. బిడ్డను ఎత్తుకుని సర్కార్ ఆసుపత్రికి వెళ్లాను, డాక్టర్లు చూసి నీ బిడ్డ చనిపోయాడని చెప్పారట. చనిపోయిన బిడ్డను భుజంపైనే వేసుకుని నడుచుకుంటూ వెళ్లాను’ అని గంగవ్వ ఏడ్చేసింది.
ఇక బిగ్ బాస్ పెట్టిన లగ్జరీ బడ్జెట్ టాస్క్లో భాగంగా అఖిల్, మెహబూబ్లుపోటీ పడ్డారు. అఖిల్ 11 కార్డ్స్ సంపాదించగా.. మెహబూబ్ 12 కార్డ్స్ సంపాదించాడు. అయితే గెలిచిన కంటెస్టెంట్ తమకు ఇష్టమైన వ్యక్తితో మసాజ్ చేయించుకోవచ్చిన బంపర్ ఆఫర్ ఇవ్వడంతో మెహబూబ్ మోనాల్తో మసాజ్ చేయించుకున్నాడు.
మీకు కనిపించని బిగ్ బాస్ ఆత్మ అవినాష్లోకి వస్తుందని అప్పుడు ఎలాంటి ప్రశ్ననలైనా అడగొచ్చని టాస్క్ ఇచ్చారు ఇచ్చారు.ఇక బిగ్ బాస్ ఆత్మ అవినాష్ లోకి రాగానే అనేక ప్రశ్నలు వేసి విసిగించారు. అయితే హౌస్లో ఉన్న ఒక్కో కంటెస్టెంట్ గురించి చక్కగా ఫన్నీగా చెప్పుకొచ్చాడు అవినాష్. బిగ్ బాస్ మాదిరి మాట్లాడుతూ పంచ్లు వేసి అలరించాడు. బిగ్ బాస్ పాత్రలో ఒదిగిపోయాడు.
కాగా హౌస్లో నడుస్తున్న ట్రై యాంగిల్ లవ్ స్టోరీపై మోనాల్ దగ్గర ప్రస్తావన దివి తీసుకుని వచ్చింది. మీ ముగ్గురు మధ్య ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ.. అఖిల్, అభిజిత్లు ఇద్దరూ నువ్వు వాళ్ళను ఇష్టపడుతున్నావ్ అని అనుకుంటున్నారు అంది.అయితే ‘నేను ఇద్దర్నీ లైక్ చేస్తున్నా కానీ పేరుని వాడటం ఇష్టం లేదు. మా మధ్య ఏం జరగలేదు చిన్న మ్యాటర్ని పెద్దదిగా చేస్తున్నారు’ అని క్లారిటీ ఇచ్చింది మోనాల్.అయితే ఈ డిస్కషన్లో రాజశేఖర్ మాస్టర్ కూడా ఉండటంతో, స్వాతి వచ్చిన తరువాత ట్రాక్ మారిందని.. అఖిల్ పర్లేదు కానీ.. అభితో జాగ్రత్తగా ఉండాలని చెప్తూ గుసగుసలాడాడు రాజశేఖర్ మాస్టర్. వీరి మధ్య సీరియస్ డిస్కషన్తో శుక్రవారం నాటి ఎపిసోడ్ ముగిసింది.