బిగ్ బాస్ షో వాయిదా... ప్రోమోతో క్లారిటీ ఇచ్చిన స్టార్ మా!
క్వారంటైన్ కి వెళ్లిన కంటెస్టెంట్స్ లో ఇద్దరు కరోనా బారినపడ్డట్లు వార్తలు వచ్చాయి. దీనితో బిగ్ బాస్ షో వాయిదా పడనుందని, ప్రకటించిన ప్రకారం సెప్టెంబర్ 5న ప్రసారం అయ్యే అవకాశం లేదని కథనాలు వెలువడ్డాయి.
బిగ్ బాస్ రియాలిటీ షోపై ప్రేక్షకులలో ఎంతటి ఆసక్తి ఉందో అందరికీ తెలిసిందే. గత నాలుగు సీజన్స్ దుమ్మురేపే టీఆర్పీ దక్కించుకొని, సత్తా చాటాయి అసలు తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ ఎక్కుతుండగా అనే అనుమానాల నుండి, బిగ్ బాస్ అంటే పడి చస్తారు అనే స్థాయికి ఈ షో ఎదిగింది. కాగా బిగ్ బాస్ సీజన్ 5 కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కరోనా నేపథ్యంలో కొంచెం లేట్ అయినప్పటికీ... ప్రసార తేదీని స్టార్ మా ప్రకటించేసింది.
కంటెస్టెంట్స్ ని ఎంపిక చేయడంతో పాటు, క్వారంటైన్ కి పంపించడం జరిగింది. అయితే క్వారంటైన్ కి వెళ్లిన కంటెస్టెంట్స్ లో ఇద్దరు కరోనా బారినపడ్డట్లు వార్తలు వచ్చాయి. దీనితో బిగ్ బాస్ షో వాయిదా పడనుందని, ప్రకటించిన ప్రకారం సెప్టెంబర్ 5న ప్రసారం అయ్యే అవకాశం లేదని కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాలు బలపరుస్తూ ప్రచారమైన కంటెస్టెంట్స్ లిస్ట్ లో మార్పులు కనిపించాయి. దీనితో షో వాయిదా పడుతుందని వస్తున్న వార్తలలో నిజం ఉండవచ్చని కొందరు భావించారు.
అయితే ఈ పుకార్లకు చెక్ పెడుతూ... అనుకున్న ప్రకారం బిగ్ బాస్ షో ప్రసారం కానుందని స్టార్ మా క్లారిటీ ఇచ్చింది. బిగ్ బాస్ షోకి ఇంకా కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉందంటూ కొత్త ప్రోమో విడుదల చేశారు. అలా షో వాయిదా పడుతుందనే పుకార్లకు బ్రేక్ పడింది. మరోవైపు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్స్ గా అనేక పేర్లు వినిపిస్తున్నాయి. మరో నాలుగు రోజుల్లో ఎవరు హౌస్ లో ఉండేది, ఎవరు బయట ఉంది షో ఎంజాయ్ చేసేది తెలిసిపోనుంది.