Asianet News TeluguAsianet News Telugu

టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్‌ ని క్రియేట్‌ చేయబోతున్న శ్రీకాంత్‌ అడ్డాల.. ఏంటో తెలుసా?

`కొత్త బంగారులోకం`, `సీతమ్మ వాకిట్లో  సిరిమల్లె చెట్టు`, `ముకుంద`, `బ్రహ్మోత్సవం` వంటి ఫ్యామిలీ సినిమాలో ఆకట్టుకున్నారు శ్రీకాంత్‌ అడ్డాల. తన మేకింగ్‌ స్టయిల్ ఏంటో చూపించారు. కానీ ఇప్పుడు రూట్‌ మార్చారు.

director srikanth addala creat new trend in tollywood revealed in narappa promotion arj
Author
Hyderabad, First Published Jul 19, 2021, 2:23 PM IST

ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల టాలీవుడ్‌లో ఓ కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేయబోతున్నారు. ఇప్పటికే జోనర్‌ మార్చి `నారప్ప` చిత్రాన్ని తెరకెక్కించిన ఆయన త్వరలో తెలుగులో ట్రై సిరీస్‌ని పరిచయం చేయబోతున్నారు. అది మామూలుగా కాదు, ఏకంగా భారీ బడ్జెట్‌తో, పెద్ద స్టార్‌ హీరోతో ఈ సినిమా చేయనున్నారు. తాజాగా ఇంటర్వ్యూలో దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల ఈ విషయాన్ని వెల్లడించారు. 

`కొత్త బంగారులోకం`, `సీతమ్మ వాకిట్లో  సిరిమల్లె చెట్టు`, `ముకుంద`, `బ్రహ్మోత్సవం` వంటి ఫ్యామిలీ సినిమాలో ఆకట్టుకున్నారు శ్రీకాంత్‌ అడ్డాల. తన మేకింగ్‌ స్టయిల్ ఏంటో చూపించారు. కానీ ఇప్పుడు రూట్‌ మార్చారు. తనలోని మాస్‌ యాంగిల్‌ని వెంకటేష్‌ హీరోగా రూపొందిన `నారప్ప` చిత్రంలో చూపించబోతున్నారు. పూర్తి యాక్షన్‌ ఎమోషనల్‌ చిత్రాన్ని తెరకెక్కించారు. రేపు మంగళవారం ఈ సినిమా ఓటీటీలో విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా మీడియాతో ముచ్చటించారు. 

`బ్రహ్మోత్సవం` తర్వాత కావాలనే తాను యాక్షన్‌ సినిమాని ఎంపిక చేసినట్టు చెప్పారు. కొత్తగా ట్రై చేయాలని ఈ సినిమా చేశారట. రీమేక్‌ కావడంతో చాలా ఛాలెంజింగ్‌గా తీసుకుని చేశానన్నారు. ఈ సినిమా కోసం హీరో వెంకటేష్‌ చాలా కష్టపడ్డారని తెలిపారు. కొన్ని ఎమోషనల్‌ సన్నివేశాల్లో ఆయన్ని చూస్తే తన ఆలోచనలు కూడా స్ట్రక్ అయిపోయాయని చెప్పారు. చాలా టఫ్‌ రోల్‌ని ఎంతో కష్టపడి చేశారని, ఆయన నటన పీక్‌లో ఉంటుందని చెప్పారు. 

సినిమా ఓటీటీలో విడుదల కావడం పట్ల కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు చెప్పారు. తన సినిమాలు భారీ స్థాయిలో థియేటర్‌లో విడుదలవుతుంటాయి. ఆడియెన్స్ ని బిగ్‌స్క్రీన్‌పై ఎంజాయ్‌ చేయాల్సిన చిత్రమిదన్నారు. కానీ పరిస్థితుల రీత్యా ఇలా విడుదల చేయాల్సి వస్తుందని, ఈ విషయంలో వెంకటేష్‌ కూడా డిజప్పాయింట్‌ అయ్యారని చెప్పారు. తన అభిమానుల చాలా అసంతృప్తికి లోనవుతున్నారని వెల్లడించారు. 

ఈ సందర్భంగా తన నెక్ట్స్ సినిమా గురించి చెబుతూ తాను ఓ పీరియాడికల్‌ యాక్షన్‌ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు చెప్పారు. 1980 టైమ్‌లో జరిగే కథ అని, అది చాలా లార్జ్‌ స్కేల్లో ఉంటుందన్నారు. గీతా ఆర్ట్స్ లో ఈ సినిమాని ప్లాన్‌ చేస్తున్నామని, దీన్ని మూడు భాగాలుగా తీసుకురాబోతున్నట్టు చెప్పారు. తెలుగులో మూడు భాగాలుగా సినిమా అంటే ఇదే ఫస్ట్ టైమ్‌. ఇలాంటి హాలీవుడ్‌లో వస్తుంటాయి. మన వద్ద రెండు భాగాలుగా చాలా సినిమాలు వచ్చాయి. వస్తున్నాయి. కానీ ఈ సారి ఆయన మూడు భాగాలుగా ఈ సినిమాని ప్లాన్‌ చేస్తున్నారట. పాన్ ఇండియా లెవల్‌లో ఉంటుందని, ఓ పెద్ద హీరోతో అనుకుంటున్నట్టు చెప్పారు. ఇదే నిజమైతే శ్రీకాంత్‌ అడ్డాల ట్రెండ్‌ క్రియేట్‌ చేయబోతున్నారని చెప్పొచ్చు. 

Follow Us:
Download App:
  • android
  • ios