Asianet News TeluguAsianet News Telugu

బొమ్మలు పేయింట్ వేసుకునే వాడిని.. చిరంజీవి వల్లే డైరెక్టర్ అయ్యాను.. మారుతీ ఎమోషనల్ స్పీచ్..

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతీ -  గోపిచంద్ కాంబినేషనల్ లో పక్కాగా హిట్ కొట్టేందుకు వస్తున్న చిత్రం ‘పక్కా కమర్షియల్’. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు గ్రాండ్ గా జరుగుతోంది. చీఫ్ గెస్ట్ గా చిరంజీవి హాజరవగా.. మారుతీ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

Director Maruthi Emotional Speech on Pakka Commercial Movie
Author
Hyderabad, First Published Jun 26, 2022, 9:24 PM IST

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతీ -  గోపిచంద్ కాంబినేషనల్ లో పక్కాగా హిట్ కొట్టేందుకు వస్తున్న చిత్రం ‘పక్కా కమర్షియల్’. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు హైదరాబాద్ లోని హైటెక్  సిటీలో గల శిల్పా కళా వేదికలో గ్రాండ్ గా జరుగుతోంది. ఇప్పటికే ప్రకటించిన విధంగా పక్కా కమర్షియల్ మెగా  మ్యాచో ఈవెంట్ కు మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi) చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. అలాగే ప్రముక నిర్మాత అల్లు అరవింద్, దిల్ రాజ్ కూడా హాజరై ఈవెంట్ లో జోష్ ను నింపారు.. 

అయితే, ఈవెంట్ లో భాగంగా డైరెక్టర్ మారుతీ (Maruthi) మాట్లాడుతూ తన జీవితంలో మెగా స్టార్ చిరంజీవి పరోక్షంగా ప్రత్యేక భూమిక పోషించారని తెలిపారు. గతంలో బందర్ లో ఓ చిన్న ప్రాంతంలో చిరంజీవి బొమ్మలను పేయింట్ గా వేసుకుంటూ, బ్యానర్స్ ను తయారు చేసుకుంటూ జీవించేవాడినని తెలిపారు. ఎందుకో తెలియకుండానే చిరంజీవి అంటే ప్రత్యేక అభిమానం, ఇష్టం ఏర్పడిందన్నారు. అలాగే చిరంజీవిని ప్రజారాజ్యం పార్టీ స్థాపన సమయంలో కలిసినట్టుగా కల రావడం అదే నిజ జీవితంలోనూ జరగడం నేను మరిచిపోలేనింది.

ఈ రోజు తను దర్శకత్వం వహించిన ‘పక్కా కమర్షియల్’ మూవీకి చిరంజీవి గెస్ట్ గా రావడం సంతోషంగా ఉందన్నారు. నాజీవితంలో ఆయన వెంకటేశ్వర స్వామి లాంటి వాడని, ఆయన దగ్గరకి వెళ్లే క్రమంలో అల్లు అరవింద్, బన్నీ వాసు కూడా పరిచయం కావడం అద్రుష్టంగా ఉందన్నారు. మరోవైపు చిరంజీవి స్వయంగా ‘నీలో డైరెక్టర్ ఉన్నాడు’ అనే మాటలనే నన్ను డైరెక్టర్ గా నిలబెట్టాయి. మారుతీ అనే బ్రాండ్ ఏర్పడటానికి దోహదపడ్డాయని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. చిరంజీవిని మంచి వ్యక్తిత్వం కలవారని కూడా కొనియాడారు. 

గోపీచంద్‌(Gopichand) ఇటీవల `సీటీమార్‌` చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం మంచి ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న మారుతి దర్శకత్వంలో గోపీచంద్‌ `పక్కా కమర్షియల్‌`(pakka Commercial)లో నటించారు. ఈ చిత్రంలో హీరోయిన్ రాశీ ఖన్నా (Raashi Khanna), పలు కీలక పాత్రల్లో స‌త్య‌రాజ్, రావు ర‌మేశ్, సప్తగిరి తదితరులు నటించారు. జూలై 1న రిలీజ్ కానున్న ఈ మూవీని అల్లు అరవింద్  స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ క‌లిసి బ‌న్నీ వాసు నిర్మాత‌గా తెరకెక్కుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios