Dasari Narayana Rao: పాన్ ఇండియా సినిమాగా ‘దర్శకరత్న’
ఎంతో మంది హీరోలు.. హీరోయిన్లు.. దర్శకులు,.నిర్మాతలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకరత్న దాసరి నారాయణ రావు జీవితాన్ని సినిమాగా తెరకెక్కించబోతున్నారు.పాన్ ఇండియా సినిమాగా దాసరి బయోపిక్ తెరకెక్కబోతోంది.
ఎంతో మంది హీరోలు.. హీరోయిన్లు.. దర్శకులు,.నిర్మాతలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకరత్న దాసరి నారాయణ రావు(Dasari Narayana Rao) జీవితాన్ని సినిమాగా తెరకెక్కించబోతున్నారు.పాన్ ఇండియా సినిమాగా దాసరి బయోపిక్ తెరకెక్కబోతోంది.
టాలీవుడ్ లో ఎంతో మంది ఆర్టిస్ట్ లు దాసరి నారాయణ రావు(Dasari Narayana Rao) ప్రోత్సాహంతోనే స్టార్స్ గా మారారు. దాసరి వల్లే ఇండస్ట్రీకి వచ్చిన వారు ఎందరో. ఇప్పుడు స్టార్ స్టేటస్ లో ఉన్న మంచు మోహన్ బాబు దగ్గర నుంచి విప్లవ సినిమాల కెరటం... సింపుల్ సిటీకి నిలువెత్తు నిదర్శనం ఆర్ నారాయనమూర్తి వరకూ దాసరి శిష్యులే.ఇండస్ట్రీకి పెద్దగా.. చిన్న ఆర్టిస్టు ల దగ్గర నుంచి పెద్ద స్టార్స్ వరకూ.. ఏ సమస్య వచ్చినా దాసరి గడప తొక్కేవారు. ఆయన చెప్పినట్టు వినేవారు. తెలుగు ఇండస్ట్రిని కుటుంబ పెద్దగా నడిపించిన దాసరి 2017 లో ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారు.
అయితే అప్పటి నుంచి చాలా మంది గొప్ప గొప్ప నటీనటుల బయోపిక్స్ తెరకెక్కాయి.. కాని దాసరి బయోపిక్ ను ఎవరూ తెరకెక్కించలేదు. ఇఫ్పుడు భారీ స్థాయిలో దాసరి నారాయణ రావు(Dasari Narayana Rao) బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు. సీనియర్ దర్శకులు దవళసత్యం డైరెక్షన్ లో.. ఇమేజ్ ఫిల్మ్స్ పతాకంపై పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాడివాక రమేష్ నాయుడు నిర్మిస్తున్న ఈ సినిమాను దర్శకరత్న టైటిల్ తో తెలుగు,తమిళ,హిందీ భాషల్లో తెరకెక్కించబోతున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించారు టీమ్. ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చిన దర్శకరత్న దాసరి జీవితాన్ని సినిమాగా చేయడం తమ అదృష్టమన్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కబోతున్న ఈసినిమాలో దాసరి(Dasari Narayana Rao) పాత్రలో జాతియ స్థాయి నటుడు కనిపించ బోతున్నట్టు తెలిపారు. ఆయన జీవితంలో.. ప్రత్యేక మైన సిచ్యూవేషన్స్ ను అద్భుతంగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు.
Also Read :Sankranthi 2022 : అక్క ఇంట్లో బాలయ్య సంక్రాంతి సంబరాలు.. సతీ సమేతంగా కారంచేడుకు..