Asianet News TeluguAsianet News Telugu

చిరంజీవి `ఆచార్య`లో టెంపుల్‌ టౌన్‌ సెట్‌.. ఎంత పెద్దదో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!

చిరంజీవి హీరోగా రూపొందుతున్న `ఆచార్య` సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. సినిమా కోసం భారీ సెట్‌ వేస్తున్నారట. కోట్లు వెచ్చించి ఇండియాలోనే ఇప్పటి వరకు వేయనటువంటి సెట్‌ వేస్తున్నారని తెలుస్తుంది. 

chiranjeevi starrer acharya temple town set in 20acers  arj
Author
Hyderabad, First Published Jan 2, 2021, 8:53 AM IST

చిరంజీవి హీరోగా `ఆచార్య` చిత్రం రూపొందుతుంది. భారీ బడ్జెట్‌తో స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ ఈ సినిమాని రూపొందిస్తున్నారు. కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. మ్యాట్నీ ఎంటైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ ప్రై.లిమిటెడ్‌ పతాకంపై నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. 

సినిమా కోసం భారీ సెట్‌ వేస్తున్నారట. కోట్లు వెచ్చించి ఇండియాలోనే ఇప్పటి వరకు వేయనటువంటి సెట్‌ వేస్తున్నారని తెలుస్తుంది. ఈ సెట్‌ ఏకంగా 20 ఎకరాల్లో ఉంటుందట. ఇంతటి విశాలమైన సెట్‌ వేయడం ఇదే తొలిసారి అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇందులో టెంపుల్‌ టౌన్‌ని నిర్మిస్తున్నారట. ఇది సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని, దీనికోసం అయ్యే ఖర్చు కోట్లల్లో ఉంటుందని టాక్‌. 

ఈ నెల 10 నుంచి చిరంజీవిపై సోలోగా పలు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారట. అనంతరం రామ్‌చరణ్‌, ఇతర ప్రధాన తారాగణంతో కూడిన సన్నివేశాల్లో చిరు పాల్గొంటారని సమాచారం. మరోవైపు ఇందులో చిరంజీవి, రామ్‌చరణ్‌లపై ఓ పాట ఉంటుందని తెలుస్తుంది. సంక్రాంతి తర్వాత ఈ చిత్ర షూటింగ్‌ రామ్‌చరణ్‌ పాల్గొననున్నారు. ఆయన సన్నివేశాలు చిత్రీకరించేందుకు చరణ్‌ 30 రోజుల కాల్‌షీట్లు ఇచ్చారట. 

ఇందులోనే ఆయన పాత్ర సన్నివేశాలరు, అలాగే చిరుతో కలిసి సాంగ్‌ని షూట్‌ చేయబోతున్నారట. ఇప్పటికే `మగధీర`, `ఖైదీ నెంబర్‌ 150`లో చిరంజీవి, చరణ్‌ స్టెప్పులేశారు. `బ్రూస్‌లీ` చిత్రంలోనూ ఇద్దరు కలిసి మెరిశారు. ఇప్పుడు మరోసారి తండ్రీ తనయులు ఒకే తెరపై సందడి చేయబోతున్నారు. ఇది ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు. ఈ సినిమాని మేలో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios