చిరంజీవి ఆవిష్కరించిన `గల్లీ రౌడీ` ట్రైలర్.. రౌడీలను పులి అంటారట
నిజానికిది శనివారం విడుదల కావాల్సి ఉంది. కానీ చిరంజీవి..సాయిధరమ్ తేజ్కి యాక్సిడెంట్ కారణంగా అది వాయిదా పడింది. `గల్లీరౌడీ` ట్రైలర్ని ఆవిష్కరించిన చిరంజీవి చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశాడు.
`ఏ1 ఎక్స్ ప్రెస్`తో సక్సెస్ కొట్టాడు సందీప్ కిషన్. ఇప్పుడు `గల్లీరౌడీ`తో ఆడియెన్స్ ముందుకొస్తున్నాడు. జి. నాగేశ్వర్రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. నేహా శెట్టి హీరోయిన్గా నటించింది. ఈ సినిమా ట్రైలర్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. నిజానికిది శనివారం విడుదల కావాల్సి ఉంది. కానీ చిరంజీవి..సాయిధరమ్ తేజ్కి యాక్సిడెంట్ కారణంగా అది వాయిదా పడింది. `గల్లీరౌడీ` ట్రైలర్ని ఆవిష్కరించిన చిరంజీవి చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశాడు.
`నీకు తెలిసిన రౌడీ ఎవరైనా ఉన్నారా?`, `తను నిజంగానే రౌడీయా` అంటూ హీరోయిన్ చెప్పిన డైలాగ్స్తో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతోంది. ఓ సమస్యలో చిక్కుకున్న కుటుంబానికి సహాయం చేసే క్రమంలో చిక్కుల్లో పడ్డ రౌడీ పాత్రలో సందీప్ కిషన్ ఈ సినిమాలో కనిపిస్తారని.. ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఎక్కువశాతం కామెడీ కంటెంట్తో సాగే ఈ ట్రైలర్ ప్రేక్షకులతో నవ్వులు పూయిస్తుంది. వారసత్వంగా వచ్చిన రౌడీగా పేరుతెచ్చుకునేందుకు సందీప్ పడే కష్టాలు కడుపుబ్బా నవ్వించేలా సాగుతాయని చిత్ర బృందం చెబుతుంది.
ఇక ట్రైలర్ చివర్లో `పులి ఎవర్రా?` అని సందీప్ కిషన్ అడిగితే.. `కొన్నిసార్లు రౌడీలను పులి అంటారు` అంటూ వైవాహర్ష చెప్పడంతో ఈ ట్రైలర్ ముగుస్తుంది. రాజేంద్రప్రసాద్, బాబీ సింహా, వెన్నెల కిషోర్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కోన వెంకట్ సమర్పణలో కోన ఫిలిమ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమాస్ బ్యానర్లపై కోనా వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమా ఈ నెల 17వ తేదీన థియేటర్లో విడుదల కానుంది.