Asianet News TeluguAsianet News Telugu

టాలీవుడ్ డ్రగ్స్ కేసు: పూరి జగన్నాథ్, తరుణ్‌లకు ఊరట.. క్లీన్‌చిట్ ఇచ్చిన ఎఫ్ఎస్ఎల్

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరీ జగన్నాథ్, తరుణ్‌లకు ఊరట లభించింది. వీరిద్దరికి ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) క్లీన్ చీట్ ఇచ్చింది. ఇద్దరూ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆనవాళ్లు లేవని ఎఫ్ఎస్ఎల్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఛార్జ్ షీట్‌లో వెల్లడించింది తెలంగాణ ఎక్సైజ్ శాఖ. 

big relief for puri jagannadh and tarun in tollywood drugs case
Author
Hyderabad, First Published Sep 18, 2021, 4:29 PM IST

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరీ జగన్నాథ్, తరుణ్‌లకు ఊరట లభించింది. వీరిద్దరికి ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) క్లీన్ చీట్ ఇచ్చింది. ఇద్దరూ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆనవాళ్లు లేవని ఎఫ్ఎస్ఎల్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఛార్జ్ షీట్‌లో వెల్లడించింది తెలంగాణ ఎక్సైజ్ శాఖ. 

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మరో సంచలనం చోటు చేసుకుంది. 2017 జులైలో పూరి జగన్నాథ్, తరుణ్‌ల  నుంచి ఎక్సైజ్ అధికారులు రక్తం, గోళ్లను సేకరించారు. వీటిని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరి పరీక్షించింది. దాంట్లో ఎక్కడా కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు ఆనవాళ్లు లేవని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. గతేడాది డిసెంబర్ 8న దీనికి సంబంధించిన నివేదికను ఎఫ్ఎస్ఎల్ ఎక్సైజ్ శాఖకు సమర్పించింది. కెల్విన్‌పై ఛార్జ్‌షీటుతో పాటు వివరాలు కోర్టుకు సమర్పించింది ఎక్సైజ్ శాఖ. ప్రధాన నిందితుడు కెల్విన్‌కు రంగారెడ్డి జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios