Asianet News TeluguAsianet News Telugu

మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య క్లారిటీ.. టైటిల్‌ కూడా ఫిక్స్

ఈ ప్రాజెక్ట్ పై మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు బాలకృష్ణ. `ఆదిత్య 369` ఆదివారంతో ముప్పై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బాలకృష్ణ స్పందించారు. 

balakrishna revealed his son mokshagna cine entry with aditya 369 sequel arj
Author
Hyderabad, First Published Jul 19, 2021, 3:13 PM IST

నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్‌లోకి ఎంట్రీకి సంబంధించి గత కొన్ని రోజులుగా వార్తలు గుప్పుమంటూనే ఉన్నాయి. తన డైరెక్షన్‌లోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో బాలయ్య చెప్పారు. అంతేకాదు అది కూడా `ఆదిత్య 369` చిత్ర సీక్వెల్‌తో ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. దీంతో బాలయ్య అభిమానులు నూతనోత్సవంలో మునిగితేలుతున్నారు. త్వరలోనే బాలయ్య నట వారసుడిని వెండితెరపై చూడొచ్చని సంబరపడుతున్నారు. 

కానీ తాజాగా ఈ ప్రాజెక్ట్ పై మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు బాలకృష్ణ. `ఆదిత్య 369` ఆదివారంతో ముప్పై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బాలకృష్ణ స్పందించారు. ఈ  సినిమాకు సీక్వెల్‌ను 2023లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. దీనికి `ఆదిత్య 999 మ్యాక్స్‌` అనే టైటిల్‌ను ఫిక్స్ చేశామని చెప్పారు. ఈ సినిమాకి దర్శకుడిని ఖరారు చేయలేదని, తానే డైరెక్ట్ చేసే అవకాశాలున్నాయన్నారు. 

ప్రస్తుత అందుబాటులో ఉన్న టెక్నాలజీ సహాయంతో ఇప్పటి వరకు చూడని విజువల్‌ వండర్‌లా ఈ `ఆదిత్య 999 మ్యాక్స్` ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో మరో రెండేళ్ల సమయం పడుతుందన్నారు. ఈ చిత్రంతోనే తనయుడు మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేయబోతున్నట్టు తెలిపిన విషయం తెలిసిందే. దీంతో మోక్ష‌జ్ఞ ఎంట్రీకి మరో రెండేళ్లు ఉందని చెప్పొచ్చు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన ఫాంటసీ చిత్రం `ఆదిత్య 369` అప్పట్లో భారీ విజయాన్ని సాధించింది. దీన్ని శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios