Asianet News TeluguAsianet News Telugu

కూలిగా అల్లు అర్జున్..ఈ కొత్త ట్విస్ట్ ఏంటి

 బన్నీ మొదట కూలీగా పని చేసి  తర్వాత కాలంలో స్మగ్లర్‌గా మారతాడట. అయితే ఆ క్రమంలో కూలీ టు స్మగ్లర్ అనేది  ఎలా మారాడు? ప్రత్యేకంగా చూపించారని తెలిసింది. ఆ సీన్స్ ని ఎంతో గ్రిప్పింగ్‌గా చూపించడంతో పాటు స్మగ్లర్ల జీవన విధానాన్ని ఆవిష్కరించనున్నారట. అలాగే ఈ కథలో భాగంగా.., ఎర్రచందనం స్మగ్లింగ్‌ను ఎన్ని మార్గాల ద్వారా చేస్తారనేది కూడా చాలా ఇంట్రస్టింగ్ గా చిత్రీకరిస్తున్నారట. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ మారేడుమిల్లిలో జరుగుతోంది.  

Allu Arjun as cooli in Pushpa movie
Author
Hyderabad, First Published Nov 12, 2020, 9:32 AM IST

 స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, ద‌ర్శ‌కుడు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం ‘పుష్ప’‌. ఈ చిత్రం బన్ని ...ఏ కూలీగా ఫస్టాఫ్ లో కనపడనున్నాడని సమాచారం. ఈ చిత్రంలో బన్నీ పాత్ర పేరు ‘పుష్పరాజ్‌’. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ సినిమా లో బన్నీ మొదట కూలీగా పని చేసి  తర్వాత కాలంలో స్మగ్లర్‌గా మారతాడట. అయితే ఆ క్రమంలో కూలీ టు స్మగ్లర్ అనేది  ఎలా మారాడు? ప్రత్యేకంగా చూపించారని తెలిసింది. ఆ సీన్స్ ని ఎంతో గ్రిప్పింగ్‌గా చూపించడంతో పాటు స్మగ్లర్ల జీవన విధానాన్ని ఆవిష్కరించనున్నారట. అలాగే ఈ కథలో భాగంగా.., ఎర్రచందనం స్మగ్లింగ్‌ను ఎన్ని మార్గాల ద్వారా చేస్తారనేది కూడా చాలా ఇంట్రస్టింగ్ గా చిత్రీకరిస్తున్నారట. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ మారేడుమిల్లిలో జరుగుతోంది.  

మరో ప్రక్క ఈ సినిమాలోని యాక్షన్‌ సన్నివేశం కోసం భారీ బడ్జెట్‌ కేటాయించారు. ఇందులోని ఆరు నిమిషాల సన్నివేశం కోసం రూ.6 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చిత్ర టీమ్ ఇప్పటికే ప్రకటించింది. ఈ సీన్‌ సినిమాలోనే హైలైట్‌గా నిలుస్తుందని పేర్కొంది. అంతేకాదు ఈ సినిమా కోసం కేవలం భారత్‌ దేశంలోని టెక్నీషియన్స్ తో  మాత్రమే పనిచేయబోతున్నారు. ఇది మేడిన్‌ ఇండియా ప్రాజెక్టని, భారత్‌లోని కళాకారులకు ఉపాధి కల్పించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని యూనిట్‌ పేర్కొంది. అయితే ఇప్పుడు కరోనా ప్రభావంతో ఇతర దేశాలకు వెళ్లే పరిస్దితి లేదు.   ఈ చిత్రం ఎమోషన్స్, కొన్ని వాస్తవిక సంఘటనలతో మిళితమై ఉంటుంది. అదే ప్లస్ పాయింట్ కానుంది. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నారట. 

‘అల వైకుంఠపురములో..’ సినిమా తర్వాత అల్లు అర్జున్‌ నటిస్తున్న సినిమా ఇది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక హీరోయిన్. ప్రకాశ్‌రాజ్‌, జగపతిబాబు, విజయ్‌ సేతుపతి, వెన్నెల కిశోర్‌, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా   నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్ర‌సాద్ ‌స‌ంగీతం అందిస్తున్నాడు.  తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ఏకకాలంలో విడుదల కానుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios