స్పీడు మీదున్న అల్లరోడు.. డబ్బింగ్కు `నాంది`
అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న ఇంటెన్స్ ఫిల్మ్ 'నాంది' డబ్బింగ్ పనులు రంజాన్ పర్వదినం సందర్భంగా సోమవారం మొదలయ్యాయి. విజయ్ కనకమేడల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. 'ఎ న్యూ బిగినింగ్' అనేది ఈ సినిమాకు ట్యాగ్ లైన్.
ఒకప్పుడు మినిమమ్ గ్యారెంట్ హీరోగా టాలీవుడ్ లో జెట్ స్పీడ్లో సినిమాలు చేసిన యంగ్ హీరో అల్లరి నరేష్ ఇటీవల ఫాం కోల్పోయాడు. వరుస ఫ్లాప్లు రావటంతో క్లాస్ బ్రేక్ తీసుకున్నాడు. తన స్టైల్ కామెడీ సినిమాలు చేస్తూనే త్వరలో ఓ ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు నరేష్. ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సతీష్ వేగేశ్న నిర్మిస్తోన్న సినిమా నాంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నరేష్ సరికొత్తగా కనిపించనున్నాడు.
ఇంటెన్స్ ఫిల్మ్ 'నాంది' డబ్బింగ్ పనులు రంజాన్ పర్వదినం సందర్భంగా సోమవారం మొదలయ్యాయి. విజయ్ కనకమేడల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. 'ఎ న్యూ బిగినింగ్' అనేది ఈ సినిమాకు ట్యాగ్ లైన్. ప్రస్తుత సామాజిక అంశాల మేళవింపుతో, క్రైమ్ థ్రిల్లర్ ఇతివృత్తంతో తెరకెక్కుతోంది నాంది. అల్లరి నరేష్ కామెడీ శైలికి పూర్తి భిన్నంగా వినూత్న కథ, కథనాలతో రూపుదిద్దుకుంటోంది. ఇది అల్లరి నరేశ్ నటిస్తోన్న 57వ సినిమా.
ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగే ఈ డిఫరెంట్ జానర్ చిత్రానికి అబ్బూరి రవి, చోటా కె. ప్రసాద్, శ్రీచరణ్ పాకాల, బ్రహ్మ కడలి వంటి ఉన్నత స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. వరలక్ష్మీ శరత్కుమార్, హరీష్ ఉత్తమన్, ప్రియదర్శి, ప్రవీణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా నిర్మాణానంతర కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం లాక్ డౌన్ నిబంధనల్లో సడలింపులు ఇవ్వడంతో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నాంది సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించారు చిత్రయూనిట్.