డ్రగ్స్ కేసుః నటుడు అర్మాన్ కోహ్లీ అరెస్ట్
ప్రముఖ నటుడు అర్మాన్ కోహ్లీని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. ముంబయిలోని ఆయన నివాసంపై ముందస్తు సమాచారంతో శనివారం ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
బాలీవుడ్లో డ్రగ్స్ కేసు మరోసారి బయటకు వచ్చింది. హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ టైమ్లో బయటపడ్డా డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలుస్తుంది. ఓ వైపు టాలీవుడ్లోనూ ఏసీబీ అధికారులు ఈ కేసుని తిరిగి తోడగా, అటు బాలీవుడ్లో ఏకంగా ఓ నటుడినే అరెస్ట్ చేశారు. ప్రముఖ నటుడు అర్మాన్ కోహ్లీని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. ముంబయిలోని ఆయన నివాసంపై ముందస్తు సమాచారంతో శనివారం ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
అనంతరం ఆయన ఇంట్లో డ్రగ్స్ లభించినట్టు వారు పేర్కొన్నారు. అర్మాన్ని ఏసీబీ కార్యాలయంలో విచారించనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. అర్మాన్ కోహ్లీ ఇంటికి ఎన్ సీబీ అధికారులు వచ్చి సోదాలు నిర్వహించిన, ఆయనను అరెస్ట్ చేసిన ఘటనలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ని డ్రగ్స్ కేసు కుదిపేసింది.
హీరో సుశాంత్ సింగ్ మరణానికి డ్రగ్స్ కేసు కారణమని ఓ ఆరోపణ నేపథ్యంలో రేగిన వివాదం బాలీవుడ్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. దీపికా పదుకొనె, రకుల్ ప్రీత్ సింత్, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్, రియా చక్రవర్తి వంటి నటీమణుల పేర్లు తెరపైకి వచ్చాయి. కొంత గ్యాప్తో మళ్లీ ఈ కేసుని తెరపైకి తీసుకురావడం, వెంటనే ఓ నటుడిని అరెస్ట్ చేయడం హాట్ టాపిక్గా మారింది.