రామ్ని ఢీ కొట్టే సత్తా ఆది పినిశెట్టికే ఉందట..
రామ్ని ఢీ కొట్టే సత్తా ఆదిపినిశెట్టికే ఉందని చిత్ర బృందం చెప్పకనే చెప్పేసింది. ఆదిపినిశెట్టి ఇప్పటికే `అజ్ఞాతవాసి`, `సరైనోడు` చిత్రాల్లో విలన్గా నటించి మెప్పించారు ఆది పినిశెట్టి.
రామ్ హీరోగా రూపొందుతున్న బై లింగ్వల్ చిత్రంలో మరో స్టార్ యాడ్ అయ్యారు. ఈ సినిమాలో `ఉప్పెన` ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తుండగా, తాజాగా విలన్ పాత్ర ఫైనల్ అయ్యింది. హీరోగా, విలన్ గా, బలమైన పాత్రల్లో నటిస్తూ విలక్షణ నటుడిగా మెప్పిస్తున్న ఆది పినిశెట్టి నెగటివ్ రోల్కి సెలెక్ట్ అయ్యారు. తాజాగా చిత్ర బృందం ఈ విషయాన్ని వెల్లడించింది. రామ్ని ఢీ కొట్టే సత్తా ఆదిపినిశెట్టికే ఉందని చిత్ర బృందం చెప్పకనే చెప్పేసింది.
ఆదిపినిశెట్టి ఇప్పటికే `అజ్ఞాతవాసి`, `సరైనోడు` చిత్రాల్లో విలన్గా నటించి మెప్పించారు. అలాగే `యూటర్న్`, `నిన్నుకోరి`, `రంగస్థలం`లో కీలక పాత్రల్లో తన నటనలోని అనేక కోణాలను ఆవిష్కరించారు. ఇక `రాపో19` వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న రామ్ సినిమాలో ఆయనతో ఢీ కొనబోతున్నారు. లింగుస్వామి దీనికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఇందులో కీలక పాత్రలో నదియా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా షూటింగ్ ఈ నెల 12న ప్రారంభమైంది. కంటిన్యూగా షెడ్యూల్ జరుగుతుంది. షూటింగ్ సెట్కి స్టార్ డైరెక్టర్ శంకర్, అలాగే భారతీరాజా విచ్చేసి సందడి చేశారు. దీంతో సినిమాపై హైప్ని మరింతగా పెంచారు. ఈ సినిమాకి రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత అందిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆదిపినిశెట్టి మాట్లాడుతూ, `దర్శకుడు వినిపించిన కథ బాగా నచ్చింది. `సరైనోడు` తర్వాత మళ్లీ విలన్ గా చేయాలంటే పాత్రలో ఏదైనా ప్రత్యేకత ఉండాలని అనుకున్నాను. ఇది విన్నాక నార్మల్ గా ఉండే రోల్ కాదనిపించింది. మామూలుగా సినిమాల్లో విలన్ పాత్రకు డీటెయిలింగ్ ఉండదు. ఇందులో అది ఉంది. ఇది కడప కర్నూల్ కి చెందిన రా అండ్ రస్టిక్ రోల్. తమిళంలో మధురై బేస్ లో ఉంటుంది. `సరైనోడు`లో స్టైలిష్ విలన్ గా చేశాక.. ఇందులో మళ్లీ విలన్ పాత్ర ఇంటరెస్టింగ్ గా అనిపించింది. ప్యారలల్ గా నా సినిమాలు నేను చేస్తూ డిఫరెంట్ షేడ్ ని ఇందులో చూపించవచ్చు.
`యూటర్న్` నిర్మాతలతో నాకు ఇది రెండో సినిమా. రామ్ చేసిన సినిమాలన్నీ చూశాను తను చాలా ఎనర్జిటిక్ గా చేస్తుంటారు. ఇద్దరం కలిసి ఈ సినిమాలో చేయబోతున్నందుకు హ్యాపీగా ఉంది. ఇక లింగుస్వామి గారు బలమైన విలన్ పాత్రను చాలా స్ట్రాంగ్ గా చూపించనున్నారు. ఇలాంటి కారణాల వల్ల ఈ సినిమా లో చేస్తున్నాను. ఇలాంటి అరుదైన అవకాశాలు నటుడిగా నన్ను నేను విస్తరించడానికి అవకాశం అనుకుంటున్నాను.. షూటింగ్ కోసం వేచి చూస్తున్నా` అని అన్నారు ఆది పినిశెట్టి.