Asianet News TeluguAsianet News Telugu

'సరిలేరు నీకెవ్వరు'లో సూపర్ సర్పైజ్.. ఏంటో తెలుసా..?

ఈ సినిమా నిడివి 2 గంటల 40 నిమిషాలు. ఇక బిజినెస్ మెన్ సినిమా తర్వాత మహేష్ కెరియర్ లో అతి తక్కువ రోజుల్లో కంప్లీట్ చేసిన సినిమా ఇదే కావడం విశేషం.. జూన్ 1న ప్రారంభమైన ఈ చిత్రం డిసెంబర్ 18న షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుంది. ఇక అంతే త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుంది.
 

surprise in sarileru neekevvaru movie revealed
Author
Hyderabad, First Published Jan 6, 2020, 4:24 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ హీరోయిన్ రష్మిక జంటగా సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “సరిలేరు నీకెవ్వరు ” . భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 11 వ తేదీన ఈ చిత్రం రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.  ఈ చిత్రంలో చాలా స్పెషాలిటీలు ఉన్నాయి. లేడీ అమితాబ్ విజయశాంతి 13 సంవత్సరాల తరువాత  కీలక పాత్రలో ఈ మూవీ తో రీ ఎంట్రీ ఇస్తోంది. అలాగే ఈ సినిమాలో మరో సర్ ప్రైజ్ ఉందని తేల్చి చెప్పారు అనీల్ రావిపూడి.

దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. ఒక బిగ్ సర్ ప్రైజ్ ను రివీల్ చేశారు . “సరిలేరు నీకెవ్వరు ” మూవీలో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఉన్నారు, ఏ సందర్భంలో కనపడతారు అనేది సస్పెన్స్. ఆయన మూవీ లో కనిపించే సీన్ కు దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన రీ రికార్డింగ్ అదిరిపోయింది, ఈ మూవీ ఇంత బాగా రావడానికి శ్రమించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు అన్నారు.

ఉంటానికి ఇల్లు లేదు కానీ.. కాస్ట్లీ కారు కావాలా? రాహుల్ సింప్లిగంజ్ పై ట్రోల్స్!


ఈ సినిమా నిడివి 2 గంటల 40 నిమిషాలు. ఇక బిజినెస్ మెన్ సినిమా తర్వాత మహేష్ కెరియర్ లో అతి తక్కువ రోజుల్లో కంప్లీట్ చేసిన సినిమా ఇదే కావడం విశేషం.. జూన్ 1న ప్రారంభమైన ఈ చిత్రం డిసెంబర్ 18న షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుంది. ఇక అంతే త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుంది.

ఇక ఈ సినిమాని చూసిన సెన్సార్ సభ్యులు. సినిమా బాగా ఎంటర్‌టైనింగ్‌గా ఉందని, ఆర్మీ రోల్ లో మహేష్ నటన బాగుందని అంటున్నారు. ఈ సంక్రాంతికి మహేష్ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్టు కొట్టడం ఖాయమని అంటున్నారు. మొత్తానికి సినిమాకి అంతా పాజిటివ్‌ టాకే  ఉంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios