Asianet News TeluguAsianet News Telugu

బాలీవుడ్ డ్రగ్స్ కేసు: సుశాంత్‌‌ ఫౌంహౌస్‌లో ఏం జరిగిందంటే... శ్రద్ధా కపూర్‌ కీలక వ్యాఖ్యలు

బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించిన డ్రగ్స్‌కు కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న అగ్ర కథానాయికలు దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్‌, సారా అలీఖాన్‌‌లు శనివారం ఎన్‌సీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు.

bollywood actress Shraddha Kapoor admits to partying with Sushant Singh Rajput at farmhouse
Author
Mumbai, First Published Sep 26, 2020, 10:03 PM IST

బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించిన డ్రగ్స్‌కు కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న అగ్ర కథానాయికలు దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్‌, సారా అలీఖాన్‌‌లు శనివారం ఎన్‌సీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు.

ఈ క్రమంలో గెస్ట్‌హౌజ్‌లో దీపికను, కార్యాలయంలో శ్రద్ధ, సారాలను విచారిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు వారిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుశాంత్‌ ఫాంహౌజ్‌లో జరిగే పార్టీల గురించి శ్రద్ధా కపూర్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

దీనిపై బదులిచ్చిన శ్రద్ధా.. ‘‘చిచోరే’’ సినిమా సమయంలో సుశాంత్‌ పవనా ఫాంహౌజ్‌కు వెళ్లానని చెప్పినట్లు సమాచారం. ‘‘ఆరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో మేం అక్కడికి చేరుకున్నామని.. భోజనం చేసిన తర్వాత బోటులో పార్టీ చేసుకున్నామని ఆమె వెల్లడించారు.

Also Read:బాలీవుడ్ డ్రగ్స్ కేసు: ఐదు గంటల విచారణలో.. దీపికను ఎన్సీబీ ఏం అడిగిందంటే.?

అర్ధరాత్రి దాటేంత వరకు అందరూ పార్టీలోనే ఉన్నారని పాటలు వింటూ ఎంజాయ్‌ చేశామని శ్రద్ధ చెప్పారు. అయితే తాను ఎలాంటి డ్రగ్స్‌ తీసుకోలేదని ఆమె తేల్చిచెప్పినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

అదే విధంగా సుశాంత్‌ గురించి శ్రద్ధ పలు సంచలన విషయాలు వెల్లడించినట్లు పేర్కొంది. షూటింగ్‌ సమయంలో అతడు తన వానిటీ వాన్‌లో మత్తు పదార్థాలు సేవించడం చూశానని చెప్పినట్లు వెల్లడించింది.

అలాగే సుశాంత్‌ టాలెంట్‌ మేనేజర్‌ జయ సాహాతో జరిపిన వాట్సాప్‌ చాట్‌ గురించి ఎన్సీబీ ప్రశ్నించగా, శ్రద్ధ సమాధానం దాట వేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో ఇప్పటికే ఎన్‌సీబీ ఎదుట హాజరైన మరో హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. రియా చక్రవర్తితో తాను చాట్‌ చేసిన మాట వాస్తవేమనని, అయితే తానెన్నడూ డ్రగ్స్‌ తీసుకోలేదని వెల్లడించినట్లు వార్తలు వెలువడ్డాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios