Asianet News TeluguAsianet News Telugu

రిటైర్డ్ ఏఎస్ఐని హత్య చేసి తమ్ముడి కొడుకు సెల్ఫీ తీసుకున్నాడు

తన పెదనాన్న శివరాజ్ ను హత్య చేసిన వివేక్ అనే యువకుడు ఆ తర్వాత సెల్ఫీ తీసుకున్నాడు. ఇటీవల రిటైర్డ్ ఎఎస్ఐ శివరాజ్ ను వివేక్ అనే యువకుడు కర్రతో కొట్టి చంపి పోలీసులకు లొంగిపోయాడు.

Took selfie after killing retired ASI at Utnoor
Author
Utnoor, First Published Mar 9, 2020, 12:56 PM IST

ఆదిలాబాద్: ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరులో రిటైర్డ్ ఎఎస్ఐ హత్య జరిగింది. ఈ హత్య తీవ్ర సంచలనం సృష్టించింది. తాళ్లపల్లి శివరాజ్ అనే రిటైర్డ్ ఎఎస్ఐని తమ్ముడి కుమారుడు కర్రలతో కొట్టి హత్య చేశాడు. ఈ నెల 6వ తేదీన ఈ హత్య జరిగింది. 

శివరాజ్ ను హత్య చేసిన తర్వాత నిందితుల్లో ఒక్కడైన వివేక్ సెల్ఫీ తీసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం గంగన్నపేటలో శివరాజ్ హత్య జరిగింది. 

గత కొన్నేళ్లుగా శివరాజ్ కుటుంబానికి, తమ్ముడు జైరాజ్ కుటుంబానికి మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారంనాడు జైరాజ్ కుమారుడు వివేక్ తో ఘర్షణ పడుతూ శివరాజ్ గంగన్నపేట రోడ్డు వైపు వచ్చాడు. 

వివేక్ తన చేతిలో ఉన్న కర్రతో శివరాజ్ తలపై బలంగా కొట్టాడు. దాంతో శివరాజ్ మరణించాడు. ఆ తర్వాత పోలీసు స్టేషన్ లో లొంగిపోయాడు. మృతుడి భార్య రోజా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో వివేక్ సెల్ఫీ తీసుకున్నట్లు తేలింది. 

మృతుడు శివరాజ్ కు ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. శివరాజ్ 2017లో కెరమెరీ పోలీసు స్టేషన్ లో పనిచేస్తూ రిటైర్ అయ్యాడు.

Follow Us:
Download App:
  • android
  • ios