Asianet News TeluguAsianet News Telugu

స్మశానం విషయంలో సర్పంచ్, మాజీ సర్పంచ్ ల గొడవ... మాజీ సర్పంచ్ మృతి

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం జైత్రామ్ తండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నారు. 

political clashes... ex sarpanch death on adilabad dist
Author
Utnur, First Published Jul 28, 2020, 1:00 PM IST

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం జైత్రామ్ తండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నారు. గ్రామంలో స్మశానవాటిక స్థల పరిశీలన విషయంలో సర్పంచ్, మాజీ సర్పంచ్ మద్య మొదలైన మాటలయుద్దం చిలికిచిలికి గాలివానలా మారింది. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు. ఈ క్రమంలోనే మాజీ సర్పంచ్ గుండెపోటుకు గురయి మరణించారు. 

జైత్రామ్ తండా సర్పంచ్ గా ప్రస్తుతం రేణుక అనే మహిళ సర్పంచ్ గా వున్నారు. అయితే ఆమె భర్త పరశురాంకు, మాజీ సర్పంచ్ రాథోడ్ గజానంద్ కు రాజకీయ విబేధాలున్నాయి. ఈ క్రమంలోనే స్మశానవాటికి విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుని చివరకు మాజీ సర్పంచ్ మృత్యువాడపడ్డారు. 

read more    72 ఇళ్లల్లో చోరీ.. డబ్బుతో లగ్జరీ ఇళ్లు.. అంతరాష్ట్ర దొంగ అరెస్ట్

ఇరువర్గాల ఘర్షణలో ఓ కారు, మూడు బైక్ లు ద్వంసమయ్యాయి. అలాగే నాలుగు ఇండ్లు అగ్గికి ఆహుతయ్యాయి. ఈ గొడవపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉట్నూర్ డీఎస్పీ ఉదయ్‌ రెడ్డి, ఆదిలాబాద్‌ డీఎస్పీ వెంకటేశ్వరరావు గ్రామంలో అదనపు బలగాలు, సాయుధ పోలీసులను మోహరించారు
 

Follow Us:
Download App:
  • android
  • ios