కర్నూల్ జిల్లాలో నాలుగు ఇళ్లలో భారీ చోరీ
కర్నూల్ జిల్లాలో భారీ చోరీ జరిగంది. మంత్రాలయం నియోజకవర్గంలో నాలుగు ఇళ్లలో చోరీలు జరిగాయి.
కర్నూల్: కర్నూల్ జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పరిధిలోని పెద్ద కడబూరు మండలం బసలదొడ్డి గ్రామంలో నాలుగు ఇళ్లలో దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు.బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Also read:నాలుగేళ్ల ప్లాన్: పవన్తో చర్చలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ ఆసక్తికర వ్యాఖ్యలు
మంత్రాలయం నియోజకవర్గం పరిధిలోని బసలదొడ్డి గ్రామంలో నాలుగు ఇళ్లలో దొంగలు దోపీడికి పాల్పడ్డారు. ఇందులో ఒక ద్విచక్ర వాహనం, 3 తులాల బంగారం, 20 తులాల వెండి, లక్ష రూపాయాల నగదు చోరీ చేసినట్టుగా పోలీసులకు బాధిత కుటుంబాలు ఫిర్యాదు చేశారు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.