యానాం గౌతమి గోదావరిలో ఇద్దరు యువకుల గల్లంతు, పోలీసుల గాలింపు
యానాంలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక గౌతమీ గోదావరిలో స్నానానికి దిగిన ఇద్దరు విద్యార్ధులు గల్లంతయ్యారు.
యానాంలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక గౌతమీ గోదావరిలో స్నానానికి దిగిన ఇద్దరు విద్యార్ధులు గల్లంతయ్యారు. కార్తీకమాసం కావడంతో రాజమండ్రికి చెందిన 10 మంది యువకులు కలిసి యానం విహారయాత్రకు వెళ్లారు.
ఈ క్రమంలో ముగ్గురు యువకులు నదిలో స్నానానికి వెళ్లగా.. వీరిలో ఇద్దరు కొట్టుకుపోయారు. గల్లంతైన వారిని కొప్పల శేషసాయి పవన్, నేకూరీ చంద్రహాసన్గా గుర్తించారు.
స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ , నేవీ సిబ్బంది సాయంతో నదిని జల్లెడ పడుతున్నారు. అటు ఈ విషయం గత్లంతైన యువకుల కుటుంబాల్లో తెలియడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.