Asianet News TeluguAsianet News Telugu

కరోనా నివారణకు తాను సైతం... రంగంలోకి దిగిన ఏపి గవర్నర్

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ఏపి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల విద్యార్థులతో ఓ క్యాంపెయిన్ నిర్వహించాలని ఆయన భావిస్తున్నారు. 

coronavirus... AP Governor Meeting with higher education chairman
Author
Vijayawada, First Published Mar 28, 2020, 7:27 PM IST

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని విశ్వ విద్యాలయాల విద్యార్ధులు కరోనా వ్యాప్తి నివారణకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్  బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. నిబంధనల మేరకు సామాజిక దూరాన్ని పాటిస్తూ తమ కుటుంబ సభ్యులను కూడా ఆ దిశగా ప్రేరేపించాలని సూచించారు. 

కరోనా వ్యాప్తి నేపధ్యంలో గౌరవ గవర్నర్ హరిచందన్ విశ్వవిద్యాలయాల కులపతి హోదాలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రా రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో విజయవాడ రాజ్ భవన్ వేదికగా శనివారం సమావేశం అయ్యారు. ఈ క్రమంలో  విశ్వ విద్యాలయాలలో ఉన్న తాజా పరిస్ధితులను అడిగి తెలుసుకున్నారు. 

ప్రతి విద్యార్ది సామాజిక దూరం గురించి కుటుంబ సభ్యులకు తెలిపేలా తమ వంతు ప్రయత్నం చేయాలని,  ఈ మేరకు అయా విశ్వ విద్యాలయాల ఉపకులపతులు తమ పరిధిలోని కళాశాలల ద్వారా విద్యార్ధులకు  ఈ మెయిల్ విధానంలో పిలుపును ఇవ్వాలని సూచించారు. ప్రతి విద్యార్ధి తమ  కుటుంబ సభ్యులకు సామాజిక దూరం గురించి అవగాహన కలిగించ గలిగినా ఈ సందేశం లక్షల మందికి చేరుతుందని గవర్నర్ అశాభావం వ్యక్తం చేసారు. 

మరో వైపు విశ్వ విద్యాలయాలలో అందుబాటులో ఉన్న మౌళిక వసతులను ప్రస్తుత కష్ట కాలంలో సద్వినియోగ పరుచుకోవలసి ఉందని... అతి త్వరలోనే తాను ఈ అంశానికి సంబంధించి విశ్వవిద్యాలయాల కులపతులతో సమావేశం కానున్నానని హరిచందన్ పేర్కొన్నారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోని ప్రభుత్వానికి, పాలనకు తోడ్పడటానికి విశ్వవిద్యాలయ వనరుల వినియోగం గురించి వీడియో కాన్ఫరెన్స్ విధానంలో విసిలతో తాను చర్చిస్తానన్నారు. ఈ సమావేశంలో గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తదితరులు పాల్గొన్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios