Asianet News TeluguAsianet News Telugu

యువకుడి ప్రాణం తీసిన లాక్ డౌన్: సెల్ఫీ రికార్డు చేసి బాపట్లలో ఆత్మహత్య

కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్న లాక్ డౌన్ బాపట్లలో యువకుడి ప్రాణం తీసింది. తన బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో అతను మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.

Andhra Pradesh Lock Down: Youth commits suicide at Bapatla
Author
Bapatla, First Published Apr 2, 2020, 7:56 PM IST

బాపట్ల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా బాపట్లలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి అమలు చేస్తున్న లాక్ డౌన్ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. బాపట్లలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 

అతను చిత్తూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. లాక్ డౌన్ ప్రకటించడంతో అతను కృష్ణా జిల్లాలోని తన స్వస్థలానికి బైక్ పై బయలుదేరాడు. అయితే, బాపట్లలో అతని బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అతను తన ఆత్మహత్యకు గల కారణాన్ని వివరిస్తూ సెల్ఫీ రికార్డు చేశాడు. తన ఆత్మహత్యకు పోలీసులను నిందించాడు.

బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు బాపట్లలో తనను పోలీసులు నిలిపేసి బైక్ ను స్వాధీనం చేసుకున్నారని, ఆ తర్వాత తనను బాపట్ల బస్సు స్టాండులో వదిలేశారని అతను చెప్పాడు. పోలీసులు బాధ్యత లేకుండా వ్యవహరించారని అతను విమర్శించాడు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాప కింద నీరులా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. గురువారంనాడు గత 9 గంటల వ్యవధిలో మరో 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం ఈ రోజు కొత్తగా 32 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 143కు చేరుకుంది. తాజాగా కృష్ణా జిల్లాలో 8 కేసులు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కటేసి కేసులు నమోదయ్యాయి. 

ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొన్నవారికే ఎక్కువగా కరోనా వైరస్ సోకినట్లు తేలింది. మతప్రార్థనల్లో పాల్గొని వచ్చినవారి వల్ల వారి కుటుంబ సభ్యులకు ఇతరులకు పాకుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios